ఆర్టీసీని కేశినేనికి అప్పజెప్పే కుట్ర | P Ravendranath criticized TDP | Sakshi
Sakshi News home page

ఆర్టీసీని కేశినేనికి అప్పజెప్పే కుట్ర

Nov 8 2015 5:31 PM | Updated on Aug 10 2018 8:16 PM

ఆర్టీసీని కేసినేనికి అప్పజెప్పే కుట్ర జరుగుతోందని వైఎస్సార్ సీపీ నేత పి. రవీంద్రనాథ్ ఆరోపించారు.

ఆర్టీసీని కే శినేని ట్రావెల్స్‌కు అప్పజెప్పేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కుట్రపన్నుతున్నాడని కమలాపురం ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు పి.రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. ఈ రోజు బిహార్ ప్రజలు మోదీకి బుద్ధి చెప్పినట్లే త్వరలో ఆంధ్రాలో కూడా ప్రజలు టీడీపీకి బుద్ధి చెబుతారని జోస్యం చెప్పారు. మదనపల్లిలో జరిగిన వైఎస్సార్‌సీపీ ఆర్టీసీ మజ్దూర్ యూనియన్ సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఆర్టీసీ కార్మికుల సమస్యలు తీర్చాలని మదనపల్లి డిపోమేనేజర్ ప్రభాకర్‌కు వినతి పత్రం సమర్పించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement