అన్నదమ్ముల మధ్య వివాదం: ఒకరి మృతి | one dies of brothers riots in chagalamarru | Sakshi
Sakshi News home page

అన్నదమ్ముల మధ్య వివాదం: ఒకరి మృతి

Sep 23 2015 8:11 PM | Updated on Sep 3 2017 9:51 AM

భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది.

చాగలమర్రు (కర్నూలు): భూ వివాదంలో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో తమ్ముడు దుర్మరణం చెందాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా చాగలమర్రు మండలంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది.

వివరాలు.. మండలంలోని కల్లగోంట్ల గ్రామానికి చెందిన సాల్మాన్, ఏసోబులు అన్నదమ్ములు. వీరి మధ్య భూమి విషయంలో గొడవ జరిగింది. దీంతో ఇరువురు ఘర్షణ పడ్డారు. ఏసోబు దాడి చేయడంతో సాల్మాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement