రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి | One dies in Road accident | Sakshi
Sakshi News home page

రెండు బైక్‌లు ఢీ: ఒకరు మృతి

Jan 11 2016 5:07 PM | Updated on Aug 30 2018 3:58 PM

కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.

పాములపాడు : కర్నూలు జిల్లా పాములపాడు మండలం రుద్రవరం గ్రామ సమీపంలో సోమవారం మధ్యాహ్నం రెండు బైక్‌లు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. జూపాడు బంగ్లా మండలం లింగాపురం గ్రామానికి చెందిన రాజు (43) సంక్రాంతి పండుగ సందర్భంగా రుద్రవరంలోని అత్తగారింటికి బైక్‌పై వెళుతున్నాడు.

అత్తగారింటికి చేరుకునేలోపే... గ్రామ శివార్లలో ఎదురుగా వచ్చిన ఓ బైక్ ఢీకొంది. ఈ ఘటనలో రాజు తీవ్ర గాయాలతో మృతి చెందాడు. మరో బైక్‌పై ప్రమాదానికి కారణమైన ప్రకాశం జిల్లా దోర్నాల మండలం కుంట గ్రామానికి చెందిన రమేష్‌కు స్వల్ప గాయాలయ్యాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement