తాడేపల్లిగూడెం : నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్) సంస్థను వెంకట్రామన్నగూడెంలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన వర్సిటీ వెనుక వైపున ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉంగుటూరు మండలం నాచుగుంట రెవె న్యూ పరిధిలో కేంద్ర అటవీ పర్యావరణ శాఖకు చెందిన భూముల్లో దీనిని ఏర్పాటు చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. గతంలో దీనికోసం తాడేపల్లిగూడెం మండ లం కొండ్రుప్రోలు, తాడేపల్లిగూడెం, కడకట్ల రెవెన్యూ పరిధిలో ఉన్న 244 ఎకరాల భూమిని అందుబాటులో ఉన్నట్టుగా చూపించారు. అలాగే నాచుగుంట రెవెన్యూ పరిధిలోని వెంకట్రామన్నగూడెం ఉద్యాన వర్సిటీ వెనుక ఉన్న అటవీశాఖ భూముల వివరాలను సర్వే నంబర్లతో సహా పంపారు.
నిట్ ఏర్పాటు కావాలంటే కచ్చితంగా 300 ఎకరాల భూమి అందుబాటులో ఉండాలనే నిబంధన ఉంది. ఇదే సమయంలో కేంద్ర విద్యాసంస్థల ఏర్పాటుకు భూసేకరణలో భాగంగా మునిసిపల్ శాఖ మంత్రి పి.నారాయణ నేతృత్వంలో బృందం వివిధ జిల్లాల్లో పర్యటించే క్రమంలో తాడేపల్లిగూడెం, ఉంగుటూరు మండల పరిధిలోని భూము లను పరిశీలించింది. ఉద్యాన వర్సిటీ ప్రాంతంలో ఉన్న భూములు, నిట్ ఏర్పాటుకు అనువుగా ఉంటాయా, లేదా నిట్ సంస్థకు ఈ భూములు దఖలు పడాలంటే తీసుకోవాల్సిన చర్యలేమిటనే దానిపై వర్సిటీ ఉన్నతాధికారులతో మంత్రులు పి.నారాయణ, పైడికొండల మాణిక్యాలరావు చర్చించారు. తరువాత రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్రానికి ప్రతిపాదనలు పంపించారు.
అనంతర పరిణామాల నేపథ్యంలో అసెంబ్లీలో సీఎం చంద్రబాబు జిల్లాకు నిట్ను కేటాయిస్తున్నట్టు ప్రకటించగా, దీనిని గూడెం ప్రాంతంలో ఏర్పాటు చేయనున్నట్టు ఇటీవల మంత్రి మాణిక్యాలరావు వెల్లడించారు. ఇక్కడ అటవీభూముల్లో ఉద్యాన వర్సిటీకి ఎంతవరకు భూములను కేటాయించారో, అక్కడి నుంచి మూడు వందల ఎకరాలకు పైగా భూమిని నిట్ కోసం కేటాయించనున్నారని సమాచారం. అన్ని సంస్థలు ఒకేచోట కేంద్రీకృతం చేశారనే విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉండటం, నాచుగుంట అటవీ భూముల లో నిట్ ఏర్పాటు చేస్తే ఇది ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోకి వస్తుం డటంతో సమన్యాయం పాటించినట్టవుతుందని భావిస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈ ప్రాంతంలో నిట్ ఏర్పాటయ్యే అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. కేంద్ర మానవవనరుల శాఖాధికారులు స్థల పరిశీలన అనంతరం తుది రూపం ఇవ్వనున్నారు.
వెంకట్రామన్నగూడెంలోనే ‘నిట్’
Published Wed, Sep 17 2014 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
ఆ పూలు స్టార్స్లా అందంగా ఉన్నా..వాసన మాత్రం భరించలేం!
IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
ఉద్యోగం వెతుక్కునే క్రమంలో ఇలా చెయ్యొద్దు!: గూగుల్ ఉద్యోగి
ఇజ్రాయెల్ ప్రధాని కీలక నిర్ణయం.. అల్ జజీరా ఛానెల్పై నిషేధం
‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను ఆపాలని భూకజ్జాదారులు యత్నిస్తున్నారు’
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
తప్పక చదవండి
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement