మానవత్వాన్ని మరిచిపోయేలా కన్న పేగు తెంచుకుని పుట్టిన పసికందును పోదల్లో వదిలేసింది ఓ తల్లి.
చాగల్లు(పశ్చిమగోదావరి): మానవత్వాన్ని మరిచిపోయేలా కన్న పేగు తెంచుకుని పుట్టిన పసికందును పోదల్లో వదిలేసింది ఓ తల్లి. ఈ సంఘటన పశ్చిమగోదావరి జిల్లా, చాగల్లు మండలం చంద్రవరంలో గురువారం చోటుచేసుకుంది. గ్రామ శివారులోని ముళ్ల పొదల్లో అప్పుడే పుట్టిన పసికందు ఏడుపు వినిపించడంతో గ్రామస్థులు అక్కడికి చేరుకొని ఆ చిన్నారిని చికిత్స నిమిత్తం నిడదవోలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
సమాచారం తెలుసుకున్న చాగల్లు ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎం విజయకుమారి పసికందును ఏలూరులోని శిశు సంరక్షణ కేంద్రానికి తరలించారు.