రాజమండ్రిలో ముగిసిన నంది నాటకోత్సవాలు | nandi festivals comes to an end | Sakshi
Sakshi News home page

రాజమండ్రిలో ముగిసిన నంది నాటకోత్సవాలు

May 31 2015 10:39 AM | Updated on Sep 3 2017 3:01 AM

రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి.

రాజమండ్రి:రాష్ట్ర విభజన తరువాత తొలిసారి రాష్ట్రస్థాయిలో రాజమండ్రిలో 16 రోజుల పాటు జరిగిన నంది నాటకోత్సవాలు ఆదివారం ముగిశాయి.  ఈ నంది నాటకోత్సవాల్లో 2013 సంవత్సరానికి గాను 'దేశమును ప్రేమించుమన్నా'పద్య నాటకం బంగారు నందిని దక్కించుకుంది. దీంతో పాటు డొక్కా సీతమ్మ, కన్నీటీ కథ సాంఘిక నాటికలకు బంగారు నందులు లభించాయి.

 

బాలల సాంఘిక నాటికకు బంగారు నంది దక్కింది. 2014 సంవత్సరానికి గాను  పద్య నాటకం 'విష్ణు సాహిత్యం' కూడా బంగారు నందిని చేజిక్కించుకుంది. మరో పద్య నాటకం 'నాలుగు గోడల మధ్య'కు బంగారు నంది దక్కింది.

Advertisement
 
Advertisement
Advertisement