
యూపీ, బీహార్లను ఎలా విభజించారు?
గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు.
* విభజన ప్రక్రియను తెలుసుకునేందుకు ఆ రాష్ట్రాలకు వెళ్లిన స్పీకర్ నాదెండ్ల
* అక్కడి స్పీకర్, ఉన్నతాధికారులతో భేటీలు.. నేడు యూపీలో, రేపు బీహార్లో పర్యటన
సాక్షి, హైదరాబాద్: గతంలో జరిగిన ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాల విభజన ప్రక్రియ తీరుతెన్నులను తెలుసుకునేందుకు రాష్ట్ర శాసనసభ స్పీకర్ నాదెండ్ల మనోహర్ బుధవారం ఆ రాష్ట్రాల పర్యటనకు బయలుదేరారు. ఆయనతో పాటు అసెంబ్లీ ఉన్నతాధికారుల బృందం కూడా పర్యటనలో పాల్గొంటోంది. బుధవారం సాయుంత్రం వారు ఉత్తరప్రదేశ్ రాజ ధాని లక్నోకు చేరుకున్నారు. యుూపీ స్పీకర్ వూతాప్రసాద్ పాండేతో గురువారం వునోహర్ భేటీ కానున్నారు.
ఆ రాష్ట్ర అసెంబ్లీ, సచివాలయు అధికారులతో ఇక్కడి నుంచి వెళ్లిన ఉన్నతాధికారులు చర్చలు జరుపుతారు. ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ ప్రాంతాన్ని కొత్త రాష్ట్రంగా ఏర్పాటు చేసిన సందర్భంగా యూపీ పునర్య్వవస్థీకరణ బిల్లుపై ఆ రాష్ట్ర అసెంబ్లీలో చర్చించిన తీరు, అనుసరించిన విధానాలను వునోహర్ అధ్యయునం చేయునున్నారు. అనంతరం స్పీకర్ నేతృత్వంలోని బృందం శుక్రవారం బీహార్ వెళ్తుంది. అక్కడ ఆ రాష్ట్ర స్పీకర్ ఉదయ్ నారాయుణ్ చౌదరి, ఆ రాష్ట్ర అసెంబ్లీ అధికారులతో సమావేశమై.. జార్ఖండ్ రాష్ట్ర ఏర్పాటు సమయంలో జరిగిన రాజ్యాంగ ప్రక్రియను పరిశీలిస్తారు.
రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లు ఈనెల 12న అసెంబ్లీకి రావడం, దానిపై చర్చ విషయుంలో వివాదం తలెత్తిన సంగతి తెలిసిందే. దాంతో ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాల ఏర్పాటు సందర్భంగా సంబంధిత బిల్లుపై అసెంబ్లీల్లో చర్చలు సాగిన తీరు, అనుసరించిన విధానాలకు సంబంధించిన కొన్ని పుస్తకాలను ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి స్పీకర్, శాసనవుండలి ఛైర్మన్లకు పంపించారు. వాటిని అధ్యయునం చేసి విభజన బిల్లు చర్చపై దిశానిర్దేశం చేయూలని ఆయున వారిని కోరారు. జనవరి 3 నుంచి ప్రారంభం కానున్న వులివిడత శీతాకాల సవూవేశాల్లో రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లుపై చర్చను కొనసాగించాల్సి ఉండటంతో... ఈలోగానే వేరే రాష్ట్రాల్లో జరిగిన విభజన బిల్లులపై చర్చల సరళిని అధ్యయునం చేసేందుకు స్పీకర్ వునోహర్ యుూపీ, బీహార్ రాష్ట్రాల పర్యటనలను చేపట్టారు.
పునర్వ్యవస్థీకరణ బిల్లులపై ఆయూ అసెంబ్లీల్లో ఎంతెంత సవుయుం కేటారుుంచారు? పార్టీల వారీగా సవుయుం ఇచ్చారా? లేక సభలోని సభ్యులందరి అభిప్రాయూలు సేకరించారా? సవరణల తీరుతెన్నులు, ఓటింగ్కు అవకాశవుుందా? అనే అంశాలను వారు పరిశీలిస్తున్నారు. సభ్యుల అభిప్రాయూలను తెలుసుకున్న అనంతరం వాటిని క్రోడీకరించి తిరిగి రాష్ట్రపతికి పంపించడానికి నివేదికలు ఎలా రూపొందించారన్న విషయం పైనా స్పీకర్ దృష్టి సారించనున్నారు.