రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన | municipal jac protests at sub collector offices in andrapradesh | Sakshi
Sakshi News home page

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన

Jul 24 2015 1:40 PM | Updated on Mar 21 2019 8:16 PM

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన - Sakshi

రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికుల ఆందోళన

తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ఏపీలో మున్సిపల్ కార్మికులు ఆందోళనకు దిగారు.

హైదరాబాద్: తమ డిమాండ్లను తీర్చాలంటూ గత 15 రోజులుగా కార్మికులు చేస్తున్న సమ్మెను ప్రభుత్వం పెడచెవిన పెట్టడంతో.. శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ల ముట్టడికి కార్మికులు పిలుపునిచ్చారు. ఏఐటీయూసీ, సీఐటీయూసీ ఆధ్వర్యంలో కార్మిక సంఘాలు జిల్లా కేంద్రాల్లో శుక్రవారం కలెక్టర్ కార్యాలయాలను ముట్టడించాయి. ఈ సందర్భంగా కార్మికులు మాట్లాడుతూ... కనీస వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

అలాగే ఒప్పంద కార్మికులను రెగ్యూలరైజ్ చేయాలని కోరారు. మున్సిపల్ కార్మికుల ఆందోళన కార్యక్రమానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతు ప్రకటించి కార్మికులకు అండగా నిలిచింది. విజయనగరం, కృష్ణా, గుంటూరు, విశాఖపట్టణం,ప్రకాశం, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్ సీపీ కార్మికుల పక్షాన కలెక్టర్ కార్యాలయ ముట్టడి కార్యక్రమంలో పాల్గొంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement