న్యూఢిల్లీ : దేశంలో పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల వరకు అంతా డబ్బుల మీదే నడుస్తుంది. ఓ మాటలలో చెప్పాలంటే డబ్బు అనే పదం ఎన్నికల పర్యాయపదంగా మారింది. అయితే ఇటీవల జరిగిన16వ సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొందిన లోక్సభ అభ్యర్థులు ... వారు విజయం సాధించే క్రమంలో ఒక్కోక్కరు సగటున రూ. 40.3 లక్షలు ఖర్చు చేశారని నేషనల్ ఎలక్షన్ వాచ్ (ఎన్ఈడబ్యూ), అసోసియేషన్ ఫర్ డెమెక్రాటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) వెల్లడించింది. దేశవ్యాప్తంగా 537 మంది ఎంపీలుగా ఎన్నికైన నేపథ్యంలో వారు జామా ఖర్చులపై అందించిన నివేదిక ఆధారంగా ఆ సంస్థలు ఈ మేరకు తెలిపింది.
బీజేపీకి చెందిన 277మంది ఎంపీలు ఎన్నికల కోసం 40.18 లక్షలు ఖర్చు చేసి మొదటి స్థానంలో నిలవగా ఆ తర్వాత స్థానంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 44 మంది ఎంపీలు 40.16 లక్షలు ఖర్చు చేసి రెండ స్థానంలో నిలిచారు. ఆ తర్వాత స్థానాలు వరుసగా ... ఏఐఏడిఎంకే 37 మంది ఎంపీలు ఒక్కొక్కరు 30.5 లక్షలు, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు 34 మంది 40.6 లక్షల ఖర్చుతో తర్వాత స్థానాన్ని ఆక్రమించారు.
కాలిబోర్ నియోజకవర్గం నుంచి ఎన్నికైన గౌరవ్ గోగోయి 80.2 లక్షలు ఖర్చు చేశారు. గుజరాత్లోని బరూచ్ నియోజకవర్గం నుంచి బీజేపీ ఎంపీగా ఎన్నికైన మన్సుఖ్ భాయ్ దంచీభాయ్ వసావా, అలహాబాద్ ఎంపీ శ్యామ్ చరణ్ గుప్తా 60.7 లక్షలు ఖర్చు చేసి ఆ తర్వాత వరుస స్థానాలలో నిలిచారు. ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం నుంచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించిన అశోక్ గజపతిరాజు రూ.39,369 ఖర్చు చేసి అత్యల్పంగా ఖర్చు చేసిన ఎంపీల జాబితాలో నిలిచారు.
పెద్ద రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్... నుంచి లోక్సభ బరిలో దిగే అభ్యర్థులకు రూ.40 లక్షల నుంచి రూ.70 లక్షలకు అలాగే చిన్న రాష్ట్రాలైన గోవా... నుంచి బరిలో నిలిచిన అభ్యర్థులు 20.2 లక్షల నుంచి 50.4 లక్షలకు ఈ ఏడాదే పెంచిన సంగతి తెలిసిందే.
'ఎంపీ కావడానికి 40.30 లక్షలు ఖర్చు చేశారు'
Published Sat, Aug 2 2014 11:10 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోం ఓటింగ్ పరిశీలన
నిప్పుతో చెలగాటమా!
మాదిగలను మోసం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ
‘రాహుల్ పేరు చెబితే ఓట్లు పడవు’
కాంగ్రెస్తోనే అన్నివర్గాలకు సముచిత న్యాయం
హామీలు నెరవేర్చడంలో రేవంత్ విఫలం
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
పార్లమెంట్ ఎన్నికలు బహిష్కరిస్తాం..
మూడోసారి మోదీ సర్కారే..
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement