మంగళగిరిలో రైతులకు ఆర్కే భరోసా | mla rk supports to farmers in bethapudi | Sakshi
Sakshi News home page

మంగళగిరిలో రైతులకు ఆర్కే భరోసా

May 22 2016 11:37 AM | Updated on Oct 1 2018 2:00 PM

గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే భూసేకరణ విషయమై రైతులకు భరోసా కల్పించారు.

మంగళగిరి : గుంటూరు జిల్లా మంగళగిరి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే భూసేకరణ విషయమై రైతులకు భరోసా కల్పించారు. మండలంలోని బేతపూడి గ్రామంలో ఆదివారం ఆయన రైతులతో సమావేశమయ్యారు. 2013 భూసేకరణ చట్టం ప్రకారం ప్రభుత్వం భూమిని సేకరించలేదన్నారు.

మూడు పంటలు పండే భూమిని సేకరించరాదని చట్టంలో మొదట్లోనే పేర్కొన్నారని వారికి చెప్పారు. ఈ విషయంలో ఆందోళన చెందవద్దని ఆయన రైతులకు సూచించారు. తాను అండగా ఉంటానంటూ ఆయన రైతులకు భరోసా ఇచ్చారు. అవసరమైతే కోర్టుకు వెళదామని ఆయన పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement