ఏపీ ఏడు, తెలంగాణలో మూడు ఏకగ్రీవం | MLA quota Mlc Candidates Unanimously Elected in AP, Telangana | Sakshi
Sakshi News home page

ఏపీ ఏడు, తెలంగాణలో మూడు ఏకగ్రీవం

Mar 7 2017 6:53 PM | Updated on Sep 5 2017 5:27 AM

ఏపీ ఏడు, తెలంగాణలో మూడు ఏకగ్రీవం

ఏపీ ఏడు, తెలంగాణలో మూడు ఏకగ్రీవం

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

విజయవాడ: రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆంధ్రప్రదేశ్‌ లో ఎమ్మెల్యే కోటాలో ఏడుగురు, తెలంగాణలో ముగ్గురు ఏకగ్రీవంగా శాసనమండలికి ఎన్నికయ్యారు.

ఏపీలో ఎనిమిదో అభ్యర్థిగా బరిలోకి దిగిన గంగుల ప్రభాకర్ రెడ్డి భార్య నామినేషన్ ఉపసంహరించుకోవడంతో ఎన్నిక ఏకగ్రీమైంది. వైఎస్సార్ సీపీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర్ రెడ్డి.. టీడీపీ నుంచి నారా లోకేశ్‌, కరణం బలరాం, పోతుల సునీత, బత్తుల అర్జునుడు, డొక్కా మాణిక్యవరప్రసాద్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ అభ్యర్థులు మైనంపల్లి హనుమంతరావు, ఎలిమినేటి కృష్ణారెడ్డి, గంగాధర్ గౌడ్ ఎమ్మెల్సీలుగా ఎన్నికయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement