కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య | mla balakrishna slams central government over allotments | Sakshi
Sakshi News home page

కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య

Mar 2 2015 3:00 PM | Updated on Aug 21 2018 8:34 PM

కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య - Sakshi

కేంద్రంపై తొడగొట్టిన బాలయ్య

హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు.

హిందూపూర్ ఎమ్మెల్యే, సినీహీరో నందమూరి బాలకృష్ణ కేంద్రప్రభుత్వంపై మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టుకు కేవలం వంద కోట్ల రూపాయలు మాత్రమే కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయని ఆయన ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వడంపై ఇతర రాష్ట్రాలకు లేని ఇబ్బంది కేంద్రానికి ఎందుకని నిలదీశారు. హంద్రీ నీవా కాలువ పనుల పర్యవేక్షణ కోసం అనంతపురం జిల్లాకు వెళ్లిన ఆయన.. ఈ సందర్భంగా అనంతపురంలో మీడియాతో మాట్లాడారు.

సాధారణ, రైల్వే బడ్జెట్లు రెండింటిలోనూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అన్యాయం జరిగిందని చెప్పారు. టీడీపీ- బీజేపీ కూటమిని గెలిపించిన ప్రజలను కేంద్ర ప్రభుత్వం మోసం చేస్తోందని బాలకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆందోళనను ఇప్పటికైనా అర్థం చేసుకోవాలని కోరారు. నిర్లక్ష్య విధానాన్ని కొనసాగిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement