ఓపెన్ స్కూళ్లలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు | mass copying in open inter exams | Sakshi
Sakshi News home page

ఓపెన్ స్కూళ్లలో మాస్ కాపీయింగ్ ఆరోపణలు

Apr 26 2015 12:39 PM | Updated on Sep 3 2017 12:56 AM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి.

పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఓపెన్ స్కూల్ పరీక్షల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. నేడు (ఆదివారం) పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన ఏలూరులో 10 కేంద్రాల్లో ఇంటర్ వన్ సెట్టింగ్ పరీక్షలు జరుగుతున్నాయి. సీఎస్ఐ పరీక్షా కేంద్రాల్లో మాస్ కాపీయింగ్ జరుగుతోందని సమాచారం తెలుసుకున్న మీడియా అక్కడికి చేరుకుంది. అయితే అధికారులు మీడియాలను లోపలికి అనుమతించలేదు. విద్యార్థుల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోవడం లేదు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement