⇔ కొడుకు సహా తల్లి బలవన్మరణం
⇔ శరీరంపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకున్న వైనం
⇔ పాలకొండలో విషాదం
శ్రీకాకుళం జిల్లా : సమయం.. గురువారం ఉదయం 11 గంటలు.. పాలకొండలోని సీతంపేట–ప్రభుత్వ ఆస్పత్రి రహదారి జనం రాకపోకలతో సందడిగా ఉంది. ఎవరి పనిలో వారు నిమగ్నమై ఉన్నారు.. ఇంతలో ఒళ్లంతా మంటలతో ఐదు సంవత్సరాల బాలుడు ఆహాకారాలు చేస్తూ రోడ్డపై పరుగులు తీస్తున్నాడు...జనం చూస్తుండగానే కొద్ది నిమిషాల్లోనే మరో మహిళ ఒళ్లంతా మంటలతో బాబు వెనకాలే పరుగులు తీస్తోంది.. ఒక్కసారిగా ఉలిక్కిపడిన జనం.. ఆ షాక్ నుంచి తేరుకునేలోపే బాబు పరుగు ఆగిపోయింది..గొంతుమూగపోయింది. రహదారి పక్కనే పడిపోయి ప్రాణాలు వదిలాడు.. అక్కడికి పది అడుగుల దూరంలోనే మహిళ కూడా కుప్పకూలిపోయింది. స్థానికులు మంటలను ఆర్పి ఒంటిపై తడి గోనెసంచులు కప్పినప్పటికీ ప్రయోజనం లేదు. అప్పటికే ఆమె కూడా ప్రాణాలు వదిలింది. ఈ విషాద ఘటనలో చందనాల ప్రమీల(25).. కుమారుడు సాయి(5) చనిపోయారు.
విషాద వివరాలు ఇలా..
పాలకొండలోని జెట్టివారి వీధికి చెందిన ప్రమీలకు 2010 సంవత్సరంలో సరుబుజ్జిలి మండలం నందికొండ కాలనీకి చెందిన చందనాల మురళితో వివాహమైంది. వీరికి ఐదేళ్ల కుమారుడు సాయి ఉన్నాడు. వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్న మురళి మద్యానికి బానిసై నిత్యం భార్యను వేధిస్తుండేవాడు. రోజూ తాగివచ్చి ప్రమీలను కొట్టడంతో అనారోగ్యం పాలైంది. భర్త పెట్టే వేధింపులు తాళలేని ఆమె కుమారుడుని తీసుకొని పాలకొండలోని తల్లి నాగమణి వద్దకు కొద్ది నెలల క్రితం వచ్చేసింది. బతుకు తెరువు కోసం స్థానికంగా ఓ వస్త్ర దుకాణంలో పనిచేసుకుంటూ వచ్చే ఆదాయంతో కుటుంబాన్ని నెట్టుకొస్తోంది. అయితే మూడు రోజుల క్రితం తల్లి నాగమణి వేరే గ్రామానికి బంధువుల ఇంటికి వెళ్లింది. ఈ విషయం తెలుసుకున్న మురళి ఇక్కడకు కూడా వచ్చి భార్య ప్రమీలను వేధించాడు.
గురువారం ఉదయం కూడా గొడవ జరగడంతో ఇంటి నుంచి కుమారుడుతో సహా బయటకు వచ్చేసిన ప్రమీల ఈ ఘాతుకానికి పాల్పడినట్లు పోలీసులు...స్థానికులు చెబుతున్నారు. తొలుత కుమారుడుపై కిరోసిన్ పోసి, తాను పోసుకుని నిప్పు అంటించుకున్నట్టు భావిస్తున్నారు. సంఘటన స్థలాన్ని పాలకొండ డీఎస్పీ సీహెచ్ ఆదినారాయణ, సీఐ ఎన్.వేణుగోపాలరావు, ఎస్సై ఎం.చంద్రమౌళిలు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం పాలకొండ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నామని డీఎస్పీ ఆదినారాయణ చెప్పారు. అలాగే ప్రమీల భర్త మురళీని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నామన్నారు.
చంపేశాడు..
తన కుమార్తె ..మనమడుని మురళీయే కిరోసిన్ పోసి..నిప్పంటించి చంపేశాడని ప్రమీల తల్లి నాగమణి పోలీసుల వద్ద వాపోయింది. మురళీకి గతంలో ఆమదాలవలస మండలం మెట్టక్కివలసకు చెందిన అతని అక్క కూతురుతో వివాహం జరిగిందని, ఆమె కూడా 2005లో కిరోసిన్ పోసుకుని చనిపోయిందని చెబుతూ రోదించింది. తాజా ఘటనపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి న్యాయం చేయాలని వేడుకుంది.
పుట్టిన రోజునే..తిరిగిరాని లోకానికి..
గురువారమే చిన్నారి సాయి పుట్టిన రోజు. అయితే తల్లిదండ్రుల వివాదంలో అభం..శుభం తెలియని బాబు మృత్యువు ఒడి చేరాడు. విషాదాన్ని మిగిల్చాడు.
ఏం కష్టం వచ్చిందో!
Published Fri, Apr 28 2017 5:48 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
చెలరేగిన ఆర్సీబీ బౌలర్లు.. 147 పరుగులకు గుజరాత్ ఆలౌట్
కాలేజీ ఫెస్ట్లో ఉర్రూతలూగించిన సింగర్ కార్తీక్ (ఫోటోలు)
ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
ఆయన 27 ఏళ్లు పెద్ద.. మాజీ సీఎంతో రెండో పెళ్లి.. ఎవరీ నటి?
పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
శుబ్మన్ గిల్కు ఏమైంది.. ఇలా అయితే కష్టమే! వీడియో వైరల్
ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
యూనీసెఫ్ ఇండియా నేషనల్ అంబాసిడర్గా 'కరీనా కపూర్'
‘ఆప్’ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో కేజ్రీవాల్ పేరు
టీ20 వరల్డ్కప్ వస్తోంది.. బుమ్రాకు విశ్రాంతి ఇవ్వండి: జాఫర్
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement