అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి | man suspicious death in vizianagaram district | Sakshi
Sakshi News home page

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

Aug 21 2015 12:45 PM | Updated on Sep 3 2017 7:52 AM

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవీధిలో జరిగింది.

బొబ్బిలి: అనుమానాస్పద స్థితిలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన శుక్రవారం విజయనగరం జిల్లా బొబ్బిలి మున్సిపాలిటీ పరిధిలోని గొల్లవీధిలో జరిగింది. వివరాలు.. గొల్లవీధికి చెందిన బంగారురాజు(32) అనే వ్యక్తికి మూడేళ్ల క్రితమే వివాహమైంది. అయితే, బంగారురాజుకు గొల్లవీధికే చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పడింది. కాగా, శుక్రవారం తెల్లవారుజామున ఆ మహిళ ఇంట్లోనే బంగారురాజు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. స్ధానికలు సమాచారంతో పోలీసుల సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement