మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు | Man kills woman with axe in rantachintala | Sakshi
Sakshi News home page

మహిళను గొడ్డలితో నరికి చంపిన యువకుడు

Jun 4 2014 8:53 AM | Updated on Jul 30 2018 8:27 PM

గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. స్థల వివాదం కాస్తా ఓ మహిళ ప్రాణాలు తీసింది.

గుంటూరు : గుంటూరు జిల్లా రెంటచింతలలో దారుణం జరిగింది. స్థల వివాదం కాస్తా ఓ మహిళ ప్రాణాలు తీసింది. స్థానికంగా నివాసం ఉంటున్న ఇరు కుటుంబాల మధ్య స్థల వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓ యువకుడు.... మహిళను గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటన కలకలం సృష్టించింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement