భార్యను చంపి భర్త ఆత్మహత్య | Man killing his wife after suicide | Sakshi
Sakshi News home page

భార్యను చంపి భర్త ఆత్మహత్య

Oct 5 2014 1:39 PM | Updated on Nov 6 2018 7:56 PM

గొంతునులిమి భార్యను హత్య చేసి... అనంతరం ఆమె మృతదేహన్ని రైల్వే ట్రాక్పై పడేశాడు భర్త.

అనంతపురం: గొంతునులిమి భార్యను హత్య చేసి... అనంతరం ఆమె మృతదేహన్ని రైల్వే ట్రాక్పై పడేశాడు భర్త.  ఆ తర్వాత అతడు కూడా రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనంతపురం రామ్నగర్లో ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికులు రైల్వే ట్రాక్పై మృతదేహాలు ఉన్నట్లు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

దీంతో పోలీసులు రైల్వే ట్రాక్ వద్దకు చేరుకుని మృతదేహలను స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన దంపతులు స్రవంతి, నాగేంద్రలుగా స్థానికులు గుర్తించి పోలీసులకు వెల్లడించారు. కుటుంబ కలహాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement