చెరువులో పడి వ్యక్తి మృతి | man died in vijayanagaram district | Sakshi
Sakshi News home page

చెరువులో పడి వ్యక్తి మృతి

Jan 2 2016 10:18 AM | Updated on Sep 17 2018 8:02 PM

ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది.

రాజాం: ప్రమాదవశాత్తు ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన విజయనగరం జిల్లా రాజాంలో శనివారం తెల్లవారు జామున చోటుచేసుకుంది. సాలూరుకు చెందిన బోనెల రామస్వామి(55) రాజాం మారుతీనగర్‌లో ఉంటున్న తన కొడుకు వద్దకు వచ్చాడు. ఈ రోజు తెల్లవారుజామున మారుతీ నగర్ కాలనీకి సమీపంలో ఉన్న కొత్త చెరువు వద్దకు వెళ్లిన రామస్వామి ప్రమాదవశాత్తు అందులో జారిపడి మృతి చెందాడు. ఇది గుర్తించిన స్థానికులు మృతదేహాన్ని బయటకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement