చేర్యాల రూరల్, న్యూస్లైన్ : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయ హుండీలను గురువారం లెక్కించారు. ముఖ మం డపంలో ఉదయం 10 గంటల నుంచి మొత్తం 15 హుండీలను లెక్కించగా 22,90,043 ఆదాయం వచ్చింది. కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు చెందిన శ్రీసాయి సేవా సమితి సభ్యులు, పోలీసుల బందోబస్తు మధ్య హుండీలను లెక్కించారు. ఆలయ ఈఓ కాటం రాజు, ప్రత్యేక అధికారి మల్లయ్య ఆధ్వర్యంలో హుండీలను లెక్కించగా నగదు *22,90,043 వచ్చింది. మిశ్రమ బంగారం 45 గ్రాములు, మిశ్రమ వెండి రెండు కిలోల 50 గ్రాములు, 650 కిలోల బియ్యంతోపాటు 81 విదేశీ కరెన్సీలు వచ్చాయి. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ 73 రోజు లుగా స్వామివారికి భక్తులు హుండీలలో సమర్పించిన ఆదాయమని వివరించారు. కార్యక్రమంలో ఏఈఓ అంజయ్య, సూపరింటెండెంట్లు నీల చంద్రశేఖర్, సుదర్శన్, ఆలయ సిబ్బంది, అర్చ కులు, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు.
కోడెల వేలం ఆదాయం *46,400
చేర్యాల : కొమురవెల్లి శ్రీమల్లికార్జునస్వామి ఆలయంలో ఆరు కోడెలకు గురువారం బహిరంగ వేలం పాట నిర్వహించినట్లు ఆలయ ఈఓ కాటం రాజు తెలిపారు. వేలం పాట ద్వారా *46,400 ఆదాయం వచ్చినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, అర్చకులు, స్థానికులు పాల్గొన్నారు.
Breadcrumb
మల్లన్న హుండీ ఆదాయం 22.90లక్షలు
Published Fri, Sep 13 2013 2:59 AM
Related news
-
జార్జ్ ఫ్లాయిడ్ తరహాలో మరో ఘటన.. ఊపిరాడటం లేదని వేడుకున్నా
అమెరికాలో దారుణం చోటు చేసుకుంది. నల్లజాతీయుడు జార్జ్ ఫ్లాయిడ్ మృతి తరహాలో మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఈ దారుణ ఘటనకు సంబంధించి బాడీ కెమెరా వీడియో ఫుటేజ్ను ఒహియో స్టేట్ పోలీస్ డిపార్ట్మెంట్ విడుదల చేసింది. ఈ ఘటన ఏప్రిల్ 18న చోటు చేసుకుంది. వివరాలు ప్రకారం.. ఫ్రాంక్ టైసన్ ( 53) అనే వ్యక్తిని హిట్ అండ్ రన్ కేసులో అనుమానితుడిగా భావించిన ఒహియో స్టేట్ పోలీసులు ఓ బార్లో బలవంతగా పట్టుకున్నారు. బార్లో ఉన్న ఫ్రాంక్ టైసన్ను లాక్కేళ్లుతూ.. మెడపై మోకాలు పెట్టి బలవంతంగా ఇద్దరు పోలీసులు బేడీలు వేసి ఊపరాడకుండా చేశారు. ఈ సమయంలో తనకు ఊపిరి ఆడటం లేదు.. తనను వదిలేయాలని ఎంత వేడుకున్నా ఆ ఇద్దరు పోలీసులు అస్సలు వినకుండా అతనిపై మోకాలు పెట్టి బేడీలు వేశారు. దీంతో నిమిషాల వ్యవధిలో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించగా... అప్పటికే మరణించినట్లు డాక్టర్లు నిర్ధారణ చేశారు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్గా మారింది. ఇక..ఇప్పటికే ఓ కిడ్నాప్ కేసులో 24 ఏళ్లు జైలు శిక్ష అనుభవించిన ఫ్రాంక్ టైసన్ ఏప్రిల్ 6న విడుదలయ్యారు. అయితే అతను తన పెరోల్కు సంబంధించి ఉన్నతాధికారికి రిపోర్టు చేయలేదని పోలీసులు పేర్కొన్నారు. 2020లో మినియాపొలిస్ పోలీసుల చేతిలో ఇదే జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుడి మృతి మృతి అప్పట్లో తీవ్రం దుమారం రేపింది. అనతంరం జార్జ్ మరణానికి కారణమైన డెరిక్ చౌవిక్ను కోర్టు కఠిన శిక్ష విధించిన సంగతి విదితమే.NEW: 53-year-old man dies after getting taken to the ground by police and telling them that he couldn’t breathe. As Ohio man Frank Tyson was motionless on the ground, one officer could be heard bragging about the “bar fight.” Tyson had just gotten out of prison according to… pic.twitter.com/vGUTHfLHI6— Collin Rugg (@CollinRugg) April 26, 2024 -
ఆ ద్రోహం మీ బాబుదే రామోజీ
సాక్షి, అమరావతి: అన్ని వర్గాల పక్షపాతిగా వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్న జగన్ సర్కారుకు వంకలు పెడుతూ అబద్ధాలు అచ్చేస్తున్న రామోజీరావు మరో అవాస్తవాన్ని మిత్ర ద్రోహం శీర్షికతో వండి వార్చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ వస్తే మొదటి వేటు యానిమేటర్లపైనే పడుతుందని అలవోకగా అబద్ధం ఆడేశారు. యానిమేటర్లను మోసం చేసింది చంద్రబాబేనన్న నిజాన్ని దాచిపెట్టి అప్పటి దారుణాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వంపై నెట్టేశారు. పొదుపు సంఘాల డ్వాక్రా యానిమేటర్లకు ఉమ్మడి ఏపీలో 2014కు ముందు రూ. రెండువేల గౌరవ వేతనం ఉండేది. ఆ తరువాత విభజిత ఆంధ్రప్రదేశ్కు చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే ఆ గౌరవ వేతనాన్ని నిలిపివేశారు.యానిమేటర్లును ఉద్యోగులుగా పరిగణించలేమని, జీతాలు ఇచ్చేది లేదని తెగేశారు. డ్వాక్రా సంఘాల నుంచే కొంత మొత్తం వసూలు చేసుకోవాలని కూడా సూచించారు. దీనిపై 2015లో వారు 75 రోజులు పాటు సమ్మె చేసినా ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. వీరి ఆగ్రహం ఎదురు తిరుగుతుందన్న భయంతో అదే గౌరవ వేతనం అందజేస్తామంటూ 2019 ఎన్నికలకు ఆరు నెలల ముందు ప్రకటించారు. అప్పట్లో ప్రజా సంకల్పయాత్రలో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని యానిమేటర్లు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.పార్టీ అధికారంలోకి వస్తే రూ.10 వేల చొప్పున వేతనం చెల్లిస్తామని జగన్ ప్రకటించారు. హామీ ఇచ్చినట్టుగానే గత ఐదు సంవత్సరాలుగా నిరాటంకంగా చెల్లిస్తున్నారు. అప్పట్లో బీమా మిత్ర, కళ్యాణ్మిత్రలు మండల కేంద్రాల్లో మాత్రమే అందుబాటులో ఉండేవారు. కానీ, జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం వైఎస్సార్ బీమా, వైఎస్సార్ కళ్యాణమస్తు పథకాలను వలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్దనే అందిస్తున్నారు. దీన్ని కూడా తప్పుగా పేర్కొంటూ రామోజీ విషం చిమ్మారు. -
115 మంది పోలీసులు ‘అదృశ్యం’!
దేశంలో ఎక్కడ చూసినా లోక్సభ ఎన్నికల సందడి కనిపిస్తోంది. పలువురు ప్రభుత్వ ఉద్యోగులు ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. ఈ నేపధ్యంలో యూపీలో విచిత్ర ఉదంతం చోటుచేసుకుంది. ఎన్నికల విధుల కోసం యూపీలోని కాన్పూర్ నుంచి నోయిడాకు వెళ్లిన 115 మంది పోలీసులు అదృశ్యమైన ఉదంతం వెలుగు చూసింది. మీడియాకు అందిన సమాచారం ప్రకారం గ్రేటర్ నోయిడా పోలీస్ డిప్యూటీ కమిషనర్ తనిఖీలో, కాన్పూర్ నుండి వచ్చిన 138 మంది పోలీసులలో 115 మంది అదృశ్యమైనట్లు తేలింది. ఈ పోలీసులకు దాద్రీలోని అన్షు పబ్లిక్ స్కూల్లో వసతి సౌకర్యం కల్పించారు. నోయిడా పోలీసులు ఈ గైర్హాజరైన పోలీసులపై కేసు నమోదు చేశారు. అలాగే ఈ విషయాన్ని డీజీపీ హెడ్క్వార్టర్లోని ఉన్నతాధికారులకు తెలియజేశారు. కాగా ఇలాంటి పలు ఘటనలు వెలుగులోకి రావడంతో, ఎన్నికల విధులకు హాజరైన పోలీసులను రోజువారీగా లెక్కించాలని అన్ని జిల్లాల పోలీసు కమిషనర్లకు లా అండ్ ఆర్డర్ ఏడీజీ అమితాబ్ యష్ ఆదేశాలు జారీ చేశారు. ఈ అదృశ్యమైన పోలీసులు ఎన్నికల విధులకు గైర్హాజరై, వారి వారి స్వస్థలాలకు వెళ్లిపోయారని పోలీసు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. -
Hyderabad: మాధవీలతను ఆలింగనం చేసుకున్న ఏఎస్సైపై సస్పెన్షన్ వేటు
సైదాబాద్: హైదరాబాద్ లోక్సభ బీజేపీ అభ్యర్థి మాధవీలతను ఆలింగనం చేసుకున్న సైదాబాద్ ఏఎస్సై ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది. వివరాలు... మాధవీలత భద్రత, బందోబస్తు బాధ్యతలను ఏఎస్సై ఉమాదేవికి అధికారులు కేటాయించారు. మాధవీలత తన ప్రచార కార్యక్రమాల్లో భాగంగా శనివారం ఐఎస్సదన్ డివిజన్లోని సుబ్రమణ్యనగర్లో పర్యటించారు. ఈ క్రమంలో ఉమాదేవిని మాధవీలత పేరు పెట్టి బాగున్నావా? అని పలకరించారు. దీనికి స్పందించిన ఆమె మాధవీలతకు షేక్ ఇవ్వడంతోపాటు ఆలింగనం చేసుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. అంతర్గత విచారణ చేపట్టి ఉమాదేవి చర్య ఎన్నికల కోడ్ ఉల్లంఘన కిందికి వస్తుందని గుర్తించారు. ఈ మేరకు ఉమాదేవిని సస్పెండ్ చేస్తూ కొత్వాల్ శ్రీనివాస్రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. -
సీఎం వైఎస్ జగన్పై దాడి: అది ముమ్మాటికీ హత్యాయత్నమే..
సాక్షి ప్రతినిధి, విజయవాడ : సీఎం వైఎస్ జగన్పై నిందితుడు విసిరిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి కనుబొమపై కాకుండా ముఖ్యమంత్రి తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని పోలీసులు తమ దర్యాప్తు నివేదికలో తేల్చిచెప్పారు. ఈ విషయం నిర్ధారణ అయినందునే ఐపీసీ 307 కింద హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొనడంతో అందుకు న్యాయస్థానం ఏకీభవించింది. దీంతో నిందితుడు వేముల సతీశ్కుమార్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం పోలీసులు అతనిని నెల్లూరు సబ్జైలుకు తరలించారు. అంతకుముందు.. ఈ కేసులో నిందితుడిని విజయవాడ ప్రిన్సిపల్ జూనియర్ సివిల్, మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ న్యాయస్థానంలో హాజరుపరిచినప్పుడు ఇరుపక్షాల న్యాయవాదుల మధ్య వాదనలు వాడివేడీగా సాగాయి. హత్యాయత్నం కేసును పక్కదారి పట్టించేందుకు నిందితుడి తరఫు న్యాయవాది ప్రయత్నించగా.. పోలీసుల తరఫున వాదనలు వినిపించిన అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కిశోర్ ఆ వాదనలను సమర్థవంతంగా తిప్పికొట్టారు. టీడీపీ సోషల్ మీడియాలో వైరల్ చేసిన వీడియోల ఆధారంగా నిందితుడి తరఫు న్యాయవాది వాదించడం గమనార్హం. ముఖ్యమంత్రికి రాయిదెబ్బ తగలలేదని.. గజమాల ఇనుప వైర్ గీసుకుని గాయమైందని.. పైగా, ఈ దాడికి పాల్పడాలని నిందితుడు సతీశ్ను ఎవరూ ప్రేరేపించలేదని వాదించారు. కానీ, ఈ వాదనలను ఏపీపీ కిశోర్ తిప్పికొట్టారు. పోలీసుల రిమాండ్ నివేదికలో పేర్కొన్న అంశాలను ఉటంకిస్తూ పక్కా కుట్రతోనే సీఎం వైఎస్ జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. సీఎం జగన్, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్కు తగిలిన గాయాల తీవ్రతపై ప్రభుత్వాసుపత్రి అధికారులు ఇచ్చిన నివేదికను న్యాయస్థానానికి సమర్పించారు. నిందితుడు హత్యాయత్నానికి ఉపయోగించిన పదునైన సిమెంట్ కాంక్రీట్ రాయి సీఎం జగన్ కనుబోమపై కాకుండా తలపై సున్నిత ప్రదేశంలో తగిలి ఉంటే ప్రాణాలకు ముప్పు ఏర్పడేదని నిర్ధారణ అయినందునే ఈ దుర్ఘటనను హత్యయత్నంగా కేసు నమోదు చేసినట్లు వివరించారు. కుట్రదారుల ప్రేరేపణతోనే.. గతంలో మధ్యప్రదేశ్కు చెందిన కేదర్యాదవ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును కూడా ఏపీపీ ఈ సందర్భంగా ఉదహరించారు. కొందరు కుట్రదారుల ప్రేరేపించడంతోనే నిందితుడు వేముల సతీశ్ సీఎం జగన్పై హత్యాయత్నానికి పాల్పడ్డారని పోలీసుల దర్యాప్తులో ఆధారాలతో సహా వెల్లడైందన్నారు. నిందితుడు సతీష్ మైనర్ అని అతని తరఫు న్యాయవాది వాదనను ఏపీపీ కిశోర్ తప్పని నిరూపించారు. పోలీసులు ముందుగానే నిందితుడు సతీ‹Ùకు కార్పొరేషన్ జారీచేసిన జనన ధృవీకరణ పత్రాన్ని న్యాయస్థానానికి సమర్పించారు. దాని ఆధారంగా నిందితుడికి 19 ఏళ్లు ఉన్నట్లుగా తేలిపోయింది. దీంతో న్యాయస్థానం సతీశ్కు 14 రోజుల రిమాండ్ విధించింది. అనంతరం.. భద్రతా కారణాల దృష్ట్యా అతనిని పోలీసులు నెల్లూరు సబ్జైలుకు తరలించారు. ఈ కేసులో మరింత సమాచారాన్ని రాబట్టేందుకుగాను నిందితుడు సతీశ్ను పోలీస్ కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయాలని పోలీసులు భావిస్తున్నట్టు సమాచారం.
Related News by category
-
అవ్వాతాతలకు బాబు బ్యాచ్ తెచ్చిన కష్టాలు
సాక్షి, అమరావతి: ఎన్నికల కోడ్ను అడ్డంపెట్టుకొని తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు రాష్ట్రంలోని లక్షలాది అవ్వాతాతలు, దివ్యాంగులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారిని ముప్పుతిప్పలు పెడుతున్నారు. వీరికి జీవనాధారమైన ప్రభుత్వ పింఛను అందకుండా కుట్రలు పన్నుతున్నారు. సీఎం జగన్ వలంటీర్ల ద్వారా 65,49,864 మంది అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛను లబ్ధిదారులకు నెలనెలా ఠంఛనుగా ఒకటో తేదీనే వారున్న చోటునే పింఛను అందిస్తున్నారు. గత ఐదేళ్లుగా నిరి్వఘ్నంగా ఇంటి వద్దే పింఛను అందుతుండటం చంద్రబాబు నేతృత్వంలోని ఎల్లో బ్యాచ్కు కంటగింపయింది. దీంతో బాబు బ్యాచ్ ఎన్నికల సంఘానికి చేసిన ఫిర్యాదుల కారణంగా పింఛన్ లబ్ధిదారులు గత నెలలో సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకోవాల్సి వచ్చింది. అయినా చంద్రబాబు బ్యాచ్ పచ్చ కళ్లు చల్లబడకపోవడంతో వీరికి మరిన్ని కష్టాలు వచ్చి పడ్డాయి. చంద్రబాబు హయాంలో పింఛను మంజూరవడమే గగనమైతే, ఆ వచ్చే కాస్త పింఛను కోసం అవ్వాతాతలు, దివ్యాంగులను నానా అగచాట్లకు గురిచేసే వారు. అందులోనూ కమీషన్లు గుంజేవారు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు తీసుకున్న తర్వాత అవ్వాతాతలు, దివ్యాంగులు, ఇతర పింఛన్దారుల అవస్థలకు చెల్లుచీటీ పాడారు. సంతృప్త స్థాయిలో అర్హులందరికీ ఎప్పటికప్పుడే కొత్త పింఛన్ల మంజూరు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 2.66 లక్షల మంది వలంటీర్ల ద్వారా ప్రతి నెలా ఒకటో తేదీనే ఠంఛనుగా పింఛను ఇంటి వద్దే అందించేవారు. సీఎం జగన్ చేపట్టిన ఈ అద్భుత కార్యక్రమంతో గత 58 నెలలుగా పింఛనుదారులు ఎటువంటి ఇబ్బందీలేకుండా వారి డబ్బులు అందుకున్నారు. ఇదే చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీ లు, ఎల్లో బ్యాచ్, ఎల్లో మీడియాకు మింగుడుపడలేదు. ఎన్నికల కోడ్ నెపంతో వలంటీర్ల ద్వారా లబ్ధిదారుల ఇళ్ల వద్దే పింఛన్ల పంపిణీపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, చంద్రబాబుతో సన్నిహిత సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్న రాష్ట్ర మాజీ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమే‹Ùకుమార్ తదితరులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశారు. దీంతో పింఛన్ల పంపిణీలో వలంటీర్లను పూర్తిగా దూరంగా ఉంచాలని నెల కిత్రమే ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. డీబీటీ విధానంలో లేదంటే శాశ్వత ప్రభుత్వ ఉద్యోగులు ద్వారా లబ్ధిదారుల ఇంటి వద్ద పంపిణీ చేయాలని పేర్కొంది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ ఏప్రిల్ నెల పింఛను డబ్బును సచివాలయాల వద్ద పంపిణీ చేస్తూనే, విభిన్న దివ్యాంగులు, కదల్లేక మంచానికి లేదా వీల్చైర్కే పరిమితమైన వారికి, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు వారి ఇంటి వద్దే పంపిణీ చేశారు. పింఛన్ల పంపిణీ ఈ నెల 3న మొదలుపెట్టి 8వ తేదీకల్లా పూర్తిచేశారు. సచివాలయాలకు వెళ్లి పింఛను డబ్బు తీసుకొనే క్రమంలో పలువురు ప్రాణాలు కూడా కోల్పోయారు. చల్లారని పచ్చ కళ్లు ఏప్రిల్ నెలలో పింఛను లబ్ధిదారులను నానా అగచాట్లకు గురి చేసినప్పటికీ, పచ్చ కళ్లు చల్లబడలేదు. కేంద్ర ఎన్నికల సంఘానికి మళ్లీ ఫిర్యాదులు చేయడంతో పాటు రాష్ట్రంలో ఉన్నతాధికారులందరినీ బ్లాక్మెయిల్ చేస్తూ, వ్యక్తిగతంగా వారి ప్రతిష్ట దిగజార్చేలా టీడీపీ అనుకూల మీడియాలో పింఛన్ల పంపిణీపై రకరకాల తప్పుడు కథనాలు ఇచ్చారు. దీంతో రాష్ట్రంలో పింఛన్ల పంపిణీపై పలు సూచనలు చేస్తూ కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా లబ్ధిదారులకు నేరుగా డబ్బుల పంపిణీకి బదులు బ్యాంకుల్లో జమ చేసేలా అధికారులు మళ్లీ మార్పులు చేయాల్సి వచి్చంది. 48,92,503 మంది అవ్వాతాతలు, ఇతరుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. మే, జూన్ రెండు నెలల పాటు వీరు కుటుంబంలో లేదా తెలిసిన వారిలో ఎవరో ఒకరి వెంట బెట్టుకొని బ్యాంకుల దాకా వెళ్లి ఆ డబ్బులు తెచ్చుకోవాల్సిన పరిస్థితి. గత నెలలో సచివాలయాల్లో డబ్బు తీసుకున్న వీరికి ఇప్పుడు బ్యాంకులకు వెళ్లాలంటే పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లుగా ఉంటుంది. సాధారణంగా అన్ని గ్రామాల్లో బ్యాంకులు ఉండవు. బ్యాంకులో పని ఉంటే సమీపంలోని పెద్ద పంచాయతీలకో, మండల కేంద్రాలు, లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లాలి. ఈ రెండు నెలలూ పింఛను కోసం అవ్వాతాతలకు ఈ అవస్థలు తప్పవు. మండుటెండల్లో ఎవరో ఒకరిని వెంటబెట్టుకొని ఆటోలోనో, బస్సులోనో పక్క ఊరు లేదా పట్టణాల్లోని బ్యాంకులకు వెళ్లి డబ్బు తెచ్చుకోవాలి. దీని కోసం ఒక కుటుంబంలో ఇద్దరు ఒకట్రెండు రోజులు పనులు మానుకొని, డబ్బు ఖర్చు పెట్టుకొని వెళ్లిరావాల్సి ఉంటుంది. వీరు కాకుండా విభిన్న దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో పింఛను పొందే వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, యుద్ధ వీరుల వృద్ధ వితంతువులతో పాటు బ్యాంకు ఖాతాలకు ఆధార్ అనుసంధానం లేని వారు, అసలు బ్యాంకు ఖాతాలే లేని వారికి శాశ్వత ఉద్యోగుల ద్వారా ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీకి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2.66 లక్షల మంది వలంటీర్లు ఐదు రోజుల్లో నిర్వహించే కార్యక్రమాన్ని ఇప్పుడు అందుబాటులో ఉన్న శాశ్వత ఉద్యోగుల ద్వారా వారి ఎన్నికల విధులకు ఆటంకం కలగకుండా ఇంటి వద్దే పంపిణీ చేసేందుకు 20 రోజుల దాకా సమయం పట్టే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. ఇలాంటి నిర్ణయం వల్ల ఒక గ్రామంలో రోజుకు కొందరికి అంది, మరికొందరికి అందకపోతే పింఛనుదారులలో అలజడి రేగే అవకాశమూ ఉందని అధికారులు అంటున్నారు. అయినప్పటికీ, సకాలంలో పింఛన్ల పంపిణీకి చర్యలు చేపట్టినట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి.గత చంద్రబాబు ప్రభుత్వంలో పింఛనుదారులకు అన్నీ కష్టాలే.. 2014 – 19 మధ్య రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో పింఛనుదారులు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. అవ్వాతాతలు, దివ్యాంగులు పింఛను మంజూరు కోసం ఆఫీసుల చుట్టూ ఏళ్ల తరబడి కాళ్లరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉండేది. పింఛన్ల మంజూరు మొదలు, తొలగింపులు వంటి వాటిని కూడా జన్మభూమి కమిటీలకే చంద్రబాబు అప్పగించారు. ఆ జన్మభూమి కమిటీల్లో గ్రామాల్లో ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ నేతలే పూర్తిగా ఉండడంతో వాళ్లు టీడీపీకి ఓటు వేసిన వారికి లేదా లంచాలు ఇచి్చన వారికే కొత్త పింఛన్లు మంజూరు చేసేవారు.ప్రత్యర్ధి పార్టీల సానుభూతిపరులకు పింఛన్లు మంజూరయ్యేవే కావు. ఒకవేళ అప్పటికే ఎవరికైనా మంజూరై ఉంటే నిర్దాక్షిణ్యంగా తొలగించారన్న ఆరోపణలున్నాయి. పింఛన్లు మంజూరైన వారు కూడా ఆ డబ్బు కోసం ఎదురు చూడాల్సి వచ్చేది. ఊరిలో ఎప్పుడు పింఛను పంపిణీ జరుగుతుందో తెలియక ప్రతి రోజూ ఆఫీసు దాకా వచ్చి ఎండలో కూర్చొని ఊసూరుమంటూ తిరిగి వెళ్లే పరిస్థితి ఉండేది. -
మే నెల పింఛన్ బ్యాంకు ఖాతాలో జమ
సాక్షి, అమరావతి: మే, జూన్ నెలల పింఛన్ డబ్బును ఈసారి లబ్ధిదారులకు నేరుగా నగదు రూపంలో కాకుండా డీబీటీ విధానంలో వారి బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సిస్టమ్ (ఏఈపీఎస్) విధానంలో లబ్ధిదారుల ఆధార్ నంబరు అనుసంధానమై ఉన్న బ్యాంకు ఖాతాలో నేరుగా పింఛను డబ్బు జమ చేస్తుంది. అయితే, విభిన్న దివ్యాంగ లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్య కారణాలతో పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు, సైనిక సంక్షేమ పింఛన్లు పొందుతున్న యుద్ధవీరుల వృద్ధ వితంతువులకు మాత్రం గత నెలలో మాదిరిగానే గ్రామ వార్డు సచివాలయాల ఉద్యోగులు ఇంటి వద్దకే వచ్చి పింఛను డబ్బు ఇస్తారు. ఈ రెండు నెలల్లోనూ ఒకటో తేదీ నుంచే పింఛను డబ్బు పంపిణీ చేస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం సూచనలకు అనుగుణంగా పింఛన్ల పంపిణీ విధానంలో మార్పులు చేస్తూ పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్కుమార్ ఆదివారం ఆదేశాలు చేశారు. అనంతరం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ‘మే ఒకటో తేదీ నుంచి పంపిణీ చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా 65,49,864 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం పింఛన్ల పంపిణీకి నిధులు విడుదల చేస్తుంది. అందులో 48,92,503 మంది (74.70 శాతం) లబ్ధిదారుల పింఛన్ డబ్బులు ఆధార్ నంబర్తో అనుసంధానమై ఉన్న వారి బ్యాంకు ఖాతాల్లోనే జమ అవుతాయి. లబ్ధిదారులకు ఒకటో తేదీనే డీబీటీ విధానంలో డబ్బులు జమ చేయగానే, ఆ సమాచారం బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ రూపంలో అందుతుంది. విభిన్న దివ్యాంగ వర్గానికి చెందిన లబ్ధిదారులు, తీవ్రమైన అనారోగ్యాల కారణంగా పింఛన్లు పొందుతున్న వారు, మంచం లేదా వీల్చైర్కు పరిమితమైన వారు దాదాపు 16,57,361 మంది (25.30 శాతం)కి మే ఒకటి నుంచి ఇంటి వద్దనే పింఛన్ల పంపిణీ జరుగుతుంది. పింఛన్ లబ్ధిదారులలో ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా సకాలంలో వారికి డబ్బు అందేలా క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లు, బ్యాంకులకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, ఎవరికి పింఛను డబ్బులు బ్యాంకు అకౌంట్లలో జమ చేస్తారు, ఎవరికి ఇంటి వద్దే పంపిణీ చేస్తారన్న వివరాలతో కూడిన జాబితాలను సోమవారం సాయంత్రం లేదా మంగళవారం ఉదయం గ్రామ, వార్డు సచివాలయాల్లో నోటీసు బోర్డులో కూడా ఉంచనున్నట్టు అధికారులు చెబుతున్నారు. -
గంగపుత్రుల జీవితాల్లో మీన రాశులు
వారందరివీ రెక్కాడితేగానీ డొక్కాడని కుటుంబాలు.. ఒక్క రోజు పనిలోకి వెళ్లకపోతే పస్తులుండాల్సిన పరిస్థితి.. వారికి తెలిసిన విద్య చేపల వేట మాత్రమే.. వివిధ కారణాల వల్ల స్థానికంగా చేపలు లభించని రోజుల్లో ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లాల్సిన దుస్థితి.. సముద్రంలోకి వేటకు వెళితే ఇంటికి తిరిగి వచ్చే వరకు కుటుంబ సభ్యులకు కంటి మీద కునుకు కరువు.. వేట నిషేధం సమయంలో అయితే కటిక దరిద్రం తప్పదు.. ఇదంతా ఐదేళ్ల క్రితం.. ఈ ఐదేళ్లలో సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వం ఆ పరిస్థితిని పూర్తిగా మార్చేసింది.. అన్ని విధాలా మత్స్యకారులకు అండగా నిలిచి భరోసా కల్పిస్తోంది. రికార్డు స్థాయిలో దిగుబడులు..ఎగుమతులు మత్స్య ఉత్పత్తుల దిగుబడులు గణనీయంగా పెరిగాయి. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో రొయ్యల ఉత్పత్తి 1.74 లక్షల టన్నులు ఉంటే.. ఈ 5 ఏళ్లలో 7.47 లక్షల టన్నులకు పెరిగింది. మంచినీటి రొయ్యల దిగుబడులు 10.04 లక్షల టన్నులు, ఉప్పునీటి రొయ్యల దిగుబడులు 7.06 లక్షల టన్నులకు చేరాయి. జాతీయ స్థాయిలో 77.55 శాతం ఏపీలోనే ఉత్పత్తి అవుతోంది. గ్రోత్ రేట్ జాతీయ స్థాయిలో 19.37శాతం ఉంటే, ఏపీలో 23.28 శాతంగా నమోదైంది. 2018–19లో రూ. 16,825 కోట్ల విలువైన 3.13 లక్షల టన్నుల మత్స్య ఉత్పత్తులు ఎగుమతి అయితే, 2022–23లో రూ.19,847 కోట్ల విలువైన 3.29 లక్షల టన్నులు ఎగుమతయ్యాయి. చినలక్ష్మి సంతోషం ఈమె పేరు కారే చినలక్ష్మి. కాకినాడ జిల్లా యు.కొత్తపల్లి మండలం కోనపాపపేటకు చెందిన ఈమె కుటుంబానికి చేపల వేటే జీవనాధారం. వేట నిషేధ సమయంలో చంద్రబాబు ప్రభుత్వ హయాంలో కేవలం రూ.2 వేలు మాత్రమే భృతిగా ఇచ్చేవారు. 2019లో ఎన్నికలకు కొద్ది రోజుల ముందు దాన్ని రూ.4 వేలకు పెంచారు. ప్రస్తుత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏకంగా ఆ మొత్తాన్ని రూ.10 వేలకు పెంచింది. బోటులో ఆయిల్ నింపే ప్రతిసారీ సబ్సిడీ వస్తోంది. ఆమె కుమార్తెకు నాలుగేళ్లపాటు అమ్మఒడి అందింది. ఈ ఏడాది డిగ్రీలో చేరడంతో జగనన్న విద్యాదీవెన, వసతి దీవెనకు దరఖాస్తు చేసింది. చేయూత కింద రూ.18,750, ఆసరా కింద రూ.10 వేలు చినలక్ష్మికి జమ అవుతోంది. భర్తకు మత్స్యకార పింఛన్ మంజూరైంది. పొన్నాడ జగనన్న లేఅవుట్లో సెంటున్నర స్థలమూ ఇచ్చారు. అక్కడ సెంటు రూ. 2 లక్షలకు పైగా పలుకుతోంది. ఇంటి నిర్మాణం శరవేగంగా పూర్తవుతోంది. ఇలా గతంలో ఏ ప్రభుత్వ హయాంలోనూ లబ్ధి పొందలేదని.. వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలోనే తమకు మేలు జరిగిందని చినలక్ష్మి సంతోషంతో చెబుతోంది. కాకినాడ హార్బర్ ఓ ఉదాహరణ కాకినాడ ఫిషింగ్ హార్బర్లో 2018–19లో మెకనైజ్డ్, మోటరైజ్డ్, నాన్ మోటరైజ్డ్ బోట్లు 503 ఉండగా, వాటి సంఖ్య ప్రస్తుతం 578కు చేరింది. మెకనైజ్డ్ బోట్లు 398 నుంచి ఏకంగా 451కి పెరిగాయి. 2018–19 నాటికి వేటకు వెళ్లే వారి సంఖ్య 4,149 ఉంటే ప్రస్తుతం 4,763కు పెరిగింది. మెకనైజ్డ్ బోట్లపై వేటకు వెళ్లే వారి సంఖ్య 3,582 నుంచి 4,059 మందికి చేరింది. గతంలో బోట్లపై ఆధారపడి జీవనోపాధి పొందే వారి సంఖ్య 11,971 మంది ఉండగా, ప్రస్తుతం వారి సంఖ్య 14,541 మందికి పెరిగింది. మత్స్య దిగుబడులు 2018–19లో రూ.677 కోట్ల విలువైన 22,592 టన్నులు వస్తే 2023–24లో రూ.890.12 కోట్ల విలువైన 25,153 టన్నులు వచ్చాయి. ఆక్వా రంగానికి జవసత్వాలు ఆక్వా రంగం నిలదొక్కుకోవడానికి సీఎం వైఎస్ జగన్ చొరవ, కృషి ఎంతగానో ఉపయోగపడింది. ధరలు పతనమైన సమయంలో ఏ ఒక్క ఆక్వా రైతు నష్టపోకుండా చర్యలు తీసుకున్నాం. ప్రాసెసింగ్ సంస్థలు 3 సార్లు పెంచిన ఆక్వా ఫీడ్ ధరలను ఉపసంహరించేలా చేయగలిగాం. ప్రభుత్వం నిర్దేశించిన గిట్టుబాటు ధరకే రొయ్యల కొనుగోలు చేయించగలిగాం. జోన్ పరిధిలో 10 ఎకరాల్లోపు అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ విద్యుత్ సబ్సిడీ వర్తింప చేసాం. –వడ్డి రఘురాం, వైస్ చైర్మన్, ఏపీ ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో గంగపుత్రుల జాతకాలు మారిపోయాయి. గత ప్రభుత్వ కాలంలో వారు పడిన కష్టాలు తొలగిపోయాయి. ఈ ఐదేళ్ల కాలంలో వారింట అన్నీ మీన రాశులే. వ్యయాలన్నీ ఆదాయాలుగా మారాయి. అవమానాల స్థానంలో రాజపూజ్యాలు ఎదురయ్యాయి. ఆక్వా రైతుల జీవన ప్రమాణాలు సైతం మెరుగుపడ్డాయి. గత ప్రభుత్వాల నిర్లక్ష్యంతో ఆటుపోట్లు ఎదుర్కొన్న మత్స్యకారులు, సంక్షోభంలో చిక్కుకున్న ఆక్వా రైతులకు జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం అండగా నిలిచింది. (పంపాన వరప్రసాద రావు, సాక్షి ప్రతినిధి, అమరావతి)ఐదేళ్లలో మత్స్యకారులకు రూ.4913 కోట్ల లబ్ధి చేపల వేట సమయంలో ప్రమాదవశాత్తూ మృతి చెందిన 175 మందికి ఒక్కొక్కరికి రూ.10 లక్షల చొప్పున రూ.17.50 కోట్ల పరిహారాన్ని ఈ ప్రభుత్వం అందజేసింది. చంద్రబాబు పాలనలో 300 మందికి అందిన సాయం కేవలం రూ.11.43 కోట్లు మాత్రమే. డాక్టర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జీఎస్పీసీ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 16,554 మంది మత్స్యకార కుటుంబాలకు రూ.78.22 కోట్లు, ఓఎన్జీసీ పైపులైన్ తవ్వకాల వల్ల జీవనోపాధి కోల్పోయిన 23,458 మంది కుటుంబాలకు ఐదు విడతల్లో రూ.647.44 కోట్లు సాయాన్ని ప్రభుత్వం అందించింది. వివిధ పథకాల ద్వారా ఈ 5 ఏళ్లలో రూ.4913 కోట్ల లబ్ధి నేరుగా మత్స్యకారులకు అందించింది. అప్సడా చట్టాలతో ఆక్వా రైతుకు రక్షణ ఆక్వా కల్చర్ వ్యాపార కార్యకలాపాల పర్యవేక్షణ, నియంత్రణ, ప్రోత్సాహానికి వీలుగా ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ–2020, ఏపీ ఫిష్ ఫీడ్ (క్వాలిటీ కంట్రోల్) యాక్ట్–2020(అప్సడా)లను అమలులోకి తీసుకొచ్చింది. ఇవి నేడు ఆక్వా రైతులకు రక్షణ కవచాలుగా నిలిచాయి. తీర ప్రాంత జిల్లాల్లో 35 ఆక్వా ల్యాబ్స్ ఏర్పాటుతో ఇన్పుట్ టెస్టింగ్, వ్యాధి నిర్ధారణ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. తీర గ్రామాల్లోని ఆర్బీకేల్లో 732 ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించారు. ఆర్బీకేల ద్వారా నాణ్యమైన సీడ్, ఫీడ్ సప్లిమెంట్స్, మందులు, వలలు, ఇతర ఇన్పుట్స్ పంపిణీ చేస్తున్నారు. ప్రతి 15 రోజులకోసారి సమీక్షించి అంతర్జాతీయ మార్కెట్లో రొయ్యల ధరల హెచ్చు తగ్గులను ‘అప్సడా’ ద్వారా మద్దతు ధర దక్కేలా చేస్తోంది. ఐదేళ్లలో 3 సార్లు కంపెనీలు పెంచిన ఫీడ్ ధరలను వెనక్కి తీసుకునేలా చేసింది. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆక్వా రైతులకు బీమా సౌకర్యం కలి్పంచింది. ప్రభుత్వ చర్యల ఫలితంగా డొమెస్టిక్ ఫిష్ మార్కెటింగ్కు స్కోచ్ అవార్డుతో పాటు 2021–22, 2023–24లలో బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డులు దక్కాయి. ఆక్వా రైతుకు రెట్టింపు ఆనందం ఆక్వా రంగాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా సాగు విస్తీర్ణం, దిగుబడులు, ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. బాబు హయాంలో ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ పరిధి నోటిఫై చేయడంలో జరిగిన నష్టాన్ని ఈ ప్రభుత్వం గుర్తించి రీ సర్వే చేయించింది. దీంతో 3,56,278 ఎకరాల విస్తీర్ణం పెరిగింది. విద్యుత్ కనెక్షన్ల సంఖ్య 54072కు చేరింది. జోన్ పరిధిలోకి వచ్చిన 10 ఎకరాలలోపు సాగుదారులందరికీ యూనిట్ విద్యుత్ రూ.1.50కే అందించడంతో మెజార్టీ ఆక్వా రైతులకు లబ్ధి చేకూరింది. గత ప్రభుత్వం ఎగ్గొట్టిన విద్యుత్ బకాయిలు రూ.340 కోట్లు సహా ఈ ఐదేళ్లలో రూ.3497 కోట్ల సబ్సిడీ అందుకున్నారు. దేశానికే ఆదర్శంగా ఫిష్ ఆంధ్ర స్థానిక వినియోగం పెంచడం లక్ష్యంగా ఫిష్ ఆంధ్రా బ్రాండింగ్తో డొమెస్టిక్ మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నాణ్యమైన మత్స్య ఉత్పత్తులను హబ్ అండ్ స్పోక్ మోడల్లో 40–60 శాతం సబ్సిడీతో జిల్లా స్థాయిలో ఆక్వా హబ్లు(రూ.కోటి), వాటికి అనుబంధంగా మినీ రిటైల్ అవుట్లెట్స్ (రూ.3లక్షలు), డెయి లీ (రూ.10లక్షలు), సూపర్(రూ. 20లక్షలు), లాంజ్ (రూ.50 లక్షలు) యూని ట్లు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్ప టికే జిల్లా స్థాయిలో 2 ఆక్వా హబ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా 2,630 మినీ, 113 డెయిలీ, 66 సూపర్, 31 లాంజ్, 76 త్రీ వీలర్, 179 ఫోర్ వీలర్ యూనిట్లు మంజూరయ్యా యి. ప్రత్యక్షంగా 6941 మందికి, పరోక్షంగా 13,146 మందికి ఉపాధి లభిస్తోంది. నర్సాపురం వద్ద దేశంలోనే మూడో మత్స్య యూనివర్సిటీ నర్సాపురం సమీపంలో రూ.332 కోట్లతో 40 ఎకరాల్లో ఆంధ్రప్రదేశ్ మత్స్య యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నారు. రూ.100 కోట్లతో పరిపాలనా భవనం, అకడమిక్ బ్లాక్, బాలుర, బాలికల హాస్టల్స్, రైతు శిక్షణ కేంద్రం, వైస్ చాన్సలర్ బంగ్లా, మలీ్టపర్పస్ బిల్డింగ్ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. యూనివర్సిటీ కోసం 140 పోస్టులు మంజూరు చేశారు. కార్యకలాపాలు 2023–24 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభమయ్యాయి. దీనికి అనుబంధంగా బీఎఫ్ఎస్సీ కోర్సుతో 60 సీట్లతో కొత్తగా నర్సాపురం ఫిషరీస్ కళాశాలను ఏర్పాటు చేశారు. తరగతులు కూడా ప్రారంభమయ్యాయి. ముత్తుకూరు మత్స్య కళాశాలలో సీట్ల సంఖ్యను 40 నుంచి 60కి పెంచారు. విశాఖ జిల్లా నక్కపల్లి మండలం బంగారమ్మ పేటవద్ద రూ.36.55 కోట్ల అంచనాతో 30 ఎకరాల్లో ఆక్వాటిక్ క్వారంటైన్ ఫెసిలిటీ సెంటర్ (ఏక్యూ ఎఫ్సీ)ని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. చెన్నై నుంచి కార్యకలాపాలు నిర్వహించే కోస్టల్ ఆక్వాకల్చర్ అథారిటీ (సీఏఏ) ప్రాంతీయ కార్యాలయాన్ని విజయవాడలో ఏర్పాటు చేశారు. సిబాతో పాటు మరికొన్ని కేంద్ర కార్యాలయాలను కూడా ఏపీకి తీసుకొచ్చేందుకు అడుగులు వేశారు. -
ప్రజల మనిషి జగన్
‘రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధే జగన్మోహన్రెడ్డి లక్ష్యం. నిరంతరం ప్రజల మనిషిగా నిలిచిపోవాలన్నదే ఆయన ఆకాంక్ష. గత ఎన్నికల సమయంలోనే ఆయనలో ఉన్న గొప్ప ప్రజాసేవకుడిని గుర్తించాను. ఆయన తన ఆకాంక్షలు అంచనాలకు మించి జగన్ పనిచేస్తున్నారు’ అని ప్రముఖ చలన చిత్ర నటుడు భానుచందర్ అన్నారు. జగన్ పాలనా దక్షతపై ‘సాక్షి’తో ప్రత్యేకంగా ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే... నిస్సందేహంగా జగన్ ఒక బ్రిలియంట్ గై. ఆయన ఏది చేసినా ప్రజల గురించి చేస్తున్నారు. ఆయనో అసలు సిసలు యువ నేత. ఆయనది నవ యువ భావజాలం. ఆయన రాష్ట్ర భవిష్యత్తు గురించి ప్రతీ నిమిషం ఆలోచన చేస్తున్నారు. దేశ ప్రధాని నరేంద్రమోదీ ఎలాగైతే భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పని చేస్తున్నారో... అలాగే జగన్ బాబు కూడా అదే ఆలోచనతోనే ప్రయాణం చేస్తున్నారు. ఆయన ప్రజల కోసం ఏదో ఒకటి చేయాలనే సంకల్పంతో ముందుకు వెళుతున్నారు. ప్రజల మేలు కోరి చేసే ఆయన ఆలోచనలు, ప్రణాళికలు... అన్నీ సాకారం కావాలని నేను కోరుకుంటున్నాను. వైఎస్సార్లాగా కాదు... అంతకు మించి ఈ భూమ్మీద ఎవరూ శాశ్వతం కారు. బతికినంత కాలం మనం నలుగురికి ఏం మంచి చేశామనేదే ముఖ్యం. కొన్ని తరాల పాటు మన పేరు ప్రజలకు గుర్తుండిపోవాలి. దివంగత వైఎస్సార్ విషయంలో అదే జరిగింది కదా. ఆరోగ్యశ్రీ అనే ఒక్క పథకం వల్ల వైఎస్ రాజశేఖర్రెడ్డి ఇప్పటికీ జనం గుండెల్లో శాశ్వతంగా బతికున్నారు. అలాగే జగన్బాబు కూడా అంతకు మించి అనేక మంచి పనుల ద్వారా ప్రజలకు గుర్తుండిపోవాలి అని ఆశపడుతున్నారు. నిజంగా యుక్త వయసులోనే ఇలాంటి ఆలోచనా ధోరణి రావడం చాలా గొప్ప విషయం. అది సాధించే శక్తి కూడా ఆయనకు ఉంది. –సాక్షి, అమరావతి మంచికే మద్దతు పలకాలి మోదీ నుంచి జగన్ బాబు దాకా ప్రజలకు మంచి చేసే వారికి మద్దతివ్వాలి అనేది నా మనస్తత్వం. విమర్శలు చేసేవాళ్లు ఎప్పుడూ ఉంటారు. మన దేశంలో గాం«దీజీ మీద కూడా విమర్శలు చేస్తారు. ఎవరి విమర్శల వెనక ఏముందో ప్రజలకు బాగా తెలుసు. అయితే అవన్నీ పక్కనబెట్టి మనం ప్రజలకు ఏం చేస్తున్నాం? మన వల్ల ప్రజలకు కలుగుతున్న లాభమేమిటి? అనేది జగన్ బాబుకు ముఖ్యం. తను నమ్ముకున్న అదే పంథాలో ఆయన వెళుతున్నారు.కచ్చితంగా ఆయనకు అంతా శుభమే జరగాలి. జరుగుతుంది కూడా. నేను గత ఎన్నికల ముందు కూడా జగన్ ఆలోచనలు అద్భుతంగా ఉన్నాయని, ఆయన గొప్ప పాలన అందిస్తారని అప్పుడే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. గెలిచిన తర్వాత ఒక్కసారి కూడా జగన్ను నేను కలవలేదు. అయితే అది ముఖ్యం కాదు. ఆయన ప్రజలకు మంచి చేయడం నాకు ముఖ్యం. అలాంటి ముఖ్యమంత్రికి నాలా ప్రజల మంచి కోరుకునే ప్రతీ ఒక్కరూ మద్దతివ్వాలి. ఇస్తారనే నేను నమ్ముతున్నాను. తమకెవరు మంచి చేశారనేది ప్రజల్లో ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది. తమ గురించి నిరంతరం ఆలోచించే మంచి చేసిన వారినే జనం గెలిపిస్తారు. జనం గురించి ఎప్పుడూ ఆలోచించే నాయకుడు జగన్. నా ఉద్దేశం ప్రకారం మళ్లీ జగన్ గెలవడం... ఐదేళ్ల పాటు ముఖ్యమంత్రిగా కొనసాగడం ఖాయం. -
సంక్షేమ సిరిమల్లిక
మదనపల్లె పట్టణం సుభాష్రోడ్డు వీధికి చెందిన రాజేంద్రప్రసాద్, నాగమల్లిక భార్యభర్తలు. చిన్నపాటి వ్యాపారం ద్వారా వచ్చే చాలీచాలనీ ఆదాయంతో కుటుంబాన్ని గడపాల్సి వచ్చేంది. వీరికి అమృత, వర్షిత ఇద్దరు కుమార్తెలు. పిల్లలను చదివించేందుకు ఆరి్థకంగా ఇబ్బందులు పడేవారు. రేషన్కార్డు తప్ప ఎటువంటి పథకాలు అందేవి కావు. నాగమల్లిక తెలిసిన వారి దగ్గర అప్పు చేసి సుభాష్రోడ్డులోనే చిరుతిళ్ల దుకాణం ప్రారంభించారు. వచ్చే అరకొర ఆదాయంతో కుటుంబ పోషణ కష్టంగానే ఉండేది. దీనికి తోడు పిల్లల్ని గొప్పగా చదివించాలన్న కోరిక తీరేనా? అన్న బెంగ వెంటాడేది. ఇదంతా 2019కి ముందు పరిస్థితి. వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అమలు చేసిన సంక్షేమ పథకాలలతో ఆ కుటుంబానికి భరోసా కలిగింది. వైఎస్సార్ ఆసరా, ఇద్దరు పిల్లలకు జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన, అమ్మ ఒడి వస్తోంది. రూ.6 లక్షలు విలువ చేసే ఇంటి స్థలం ఇచ్చారు. ప్రస్తుతం పెద్ద కుమార్తె అమృత బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పని చేస్తోంది. చిన్న కుమార్తె హర్షిత డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతోంది.గతంలో కష్టాలు పడిన నాగమల్లిక కుటుంబం ప్రభుత్వ పథకాల ద్వారా సుభాష్రోడ్డులోనే ఓ షాపు పెట్టి అందులో చిరుతిళ్లు తయారు చేస్తున్నారు. నిప్పట్లు, చెక్కిలాలు, అత్తిరాసలు, మిక్చర్ వంటివి తయారు చేస్తూ హోల్సేల్గా అమ్ముతున్నారు. చిరుతిళ్ల తయారీలో 10 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నారు. వీటిని తయారు చేసి షాపులో రిటైల్ అమ్మకాలతో పాటు పరిసర ప్రాంతాలకు హోల్సేల్ ధరకు సరఫరా చేస్తున్నారు. దీంతో వారి కుటుంబం ఆరి్థకంగా నిలదొక్కుకుంది. –మదనపల్లె జీవన ప్రమాణాలు పెరిగాయి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతో చాలా మందిలో జీవన ప్రమాణాలు పెరిగాయి. తలసరి ఆదాయం పెరిగింది. ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా బలహీన వర్గాలకు అందిస్తున్న నిధులతో వారు సొంతంగా వ్యాపారం చేసుకునేందుకు వీలవుతుంది. అమ్మ ఒడి, విద్యాదీవెన, వసతి దీవెనతో పేద పిల్లలు కూడా ఉన్నత చదువులు చదువుకుని స్థిరపడ్డారు. ఇది చాలా శుభపరిణామం. – జీఆర్ రుక్మిణి, పూర్వ ప్రిన్సిపాల్, మహిళా డీగ్రీ కళాశాల, మదనపల్లెవైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కలిగిన లబ్ధివైఎస్సార్ ఆసరా రూ.32,328 జగనన్న వసతి దీవెన రూ.23,350 జగనన్న విద్యాదీవెన రూ.41,201 సున్నా వడ్డీ రూ.2,850 అమ్మ ఒడి రూ.45,000 ఇంటి స్థలం రూ.6,00,000
Advertisement
Photos
View allVideo
View allఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
అలవాటైన మోసగాడు బాబు: సీఎం జగన్
సార్! ఇక్కడ రెబెల్సందరూ ‘కూటమి’గా ఏర్పడ్డార్సార్!
జ్యోతి సురేఖ స్వర్ణాల ‘హ్యాట్రిక్’
ముస్లిం రిజర్వేషన్లు రద్దు చేస్తాం
CSK vs SRH: చెతులేత్తేసిన బ్యాటర్లు.. సన్రైజర్స్ ఘోర ఓటమి
రాజ్యాంగాన్ని మార్చే కుట్ర
‘ఫిడే’ మహిళల గ్రాండ్ప్రి సిరీస్కు సిద్ధం
రైతుకు మళ్లీ గోస ఎందుకు?: కేసీఆర్
రాజస్తాన్ దర్జాగా...
సీఎం జగన్ మలివిడత ప్రచారం నేటి నుంచే...
Bullet List Block
- భారతమాత కుమార్తెగా అభ్యర్థిస్తున్నాను: రోడ్షోలో సునీతా కేజ్రీవాల్
- ‘మీరు కావాల్సినంత పాన్ తిన్నారుగా’.. ఒడిశాలో కాంగ్రెస్దే అధికారం
- అసభ్యకర వీడియోల దుమారం.. దేవెగౌడ మనవడిపై కేసు నమోదు
- బీజేపీ ఏం చేసినా ఈసీ పట్టించుకోదు.. ఆప్ ఊపిరి పీల్చుకున్నా నోటీసులు
- T20 WC: వసీం జాఫర్ జట్టు ఇదే.. అతడికి మొండిచేయి!
- మోరాయించిన ప్రముఖ యాప్.. మీమ్స్ వైరల్!
- ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
- దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
- జేసీ బ్రదర్స్కు తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి సవాల్
- Narsipatnam: బాబాయ్ను గెలిపించు స్వామీ..
What’s your opinion
is snake reptile?
What is your fav car
ముంబై కెప్టెన్గా హార్దిక్ పాండ్యా నియామకం సరైందేనా?
AP : కూటమి మ్యానిఫెస్టోపై ఏమనుకుంటున్నారు?
నమ్మశక్యం కాని వాగ్దానాలిస్తారు
ఏ పార్టీకి నచ్చిన వాగ్దానాలు వారిస్తారు
Advertisement