11న శ్రీవారికి దీపావళి ఆస్థానం | lord balaji deepavali aastanam on 11th november | Sakshi
Sakshi News home page

11న శ్రీవారికి దీపావళి ఆస్థానం

Nov 5 2015 8:08 PM | Updated on Sep 3 2017 12:04 PM

తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు.

తిరుమల: తిరుమల శ్రీవారి ఆలయంలో ఈనెల 11వ తేదీన దీపావళి ఆస్థానం నిర్వహించనున్నారు. ప్రతి ఏటా దీపావళి రోజున ఆలయంలో సుప్రభాతం నుంచి మొదటి గంట నివేదన నిర్వహిస్తారు.

అనంతరం ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య బంగారు వాకిలి ముందు ఘంటా మండపంలో దీపావళి ఆస్థానం నిర్వహిస్తారు. శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పను సర్వభూపాల వాహనంపై, మరో వాహనంపై విష్వక్సేనుడిని వేంచేపు చేస్తారు. ప్రత్యేక పూజలు, హారతి, ప్రసాద నివేదనలు చేస్తారు.
 

Advertisement
 
Advertisement
Advertisement