
తెర్లాంలో లక్షదీపార్చన
శివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్ష దీపార్చన కార్యక్రమాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆర్.వీ.సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు.
విజయనగరం: శివరాత్రిని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన లక్ష దీపార్చన కార్యక్రమాన్ని బొబ్బిలి ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి ఆర్.వీ.సుజయ్ కృష్ణ రంగారావు ప్రారంభించారు. విజయనగరం జిల్లా తెర్లాం మండలం చీకటిపల్లి గ్రామంలోని శివాలయంలో ఈ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ప్రారంభమైంది. వేల సంఖ్యలో వచ్చిన భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మార్మోగుతోంది.
(తెర్లాం)