‘కృష్ణా’ ఘటనపై విచారణ | 'Krishna', the Delhi High Court | Sakshi
Sakshi News home page

‘కృష్ణా’ ఘటనపై విచారణ

Dec 26 2013 4:15 AM | Updated on Sep 2 2017 1:57 AM

చింతలపల్లి రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ను యూటీవీ టీటీ మిషన్(యుటిలిటీ ట్రాక్ వెహికిల్ ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్) ఢీకొన్న సంఘటనపై సికింద్రాబాద్...

కాజీపేటరూరల్/సంగెం/మట్టెవాడ,న్యూస్‌లైన్ :  చింతలపల్లి రైల్వే స్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్ ను యూటీవీ టీటీ మిషన్(యుటిలిటీ ట్రాక్ వెహికిల్ ట్రాక్ ట్యాంపరింగ్ మిషన్) ఢీకొన్న సంఘటనపై సికింద్రాబాద్ రైల్వే ఉన్నతాధికారులు బుధవారం సాయంత్రం ప్రాథమిక విచారణ చేపట్టారు. రైల్వే మేనేజర్ పర్యవేక్షణలో విచారణ జరుగుతుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రమాదంలో దెబ్బతిన్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను లోకో ఇన్‌స్పెక్టర్ పర్యవేక్షణలో కాజీపేట జంక్షన్‌కు తీసుకొచ్చారు.

అనంతరం స్టేషన్ మేనేజర్ ఓదెలు, చీఫ్ క్రూ కంట్రోలర్ సీవీ.రమణ, సీడబ్ల్యూఎస్ సాంబశివరావు, ఆర్‌పీఎఫ్ సీఐ నర్సింహ సమక్షంలో మెకానిక్ సిబ్బంది ఇంజిన్‌ను తొలగించారు. దెబ్బతిన్న ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ లోకోషెడ్‌కు మరమ్మతు కోసం పంపించారు. దీంతో కాజీపేటలో 20 నిమిషాలపాటు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశా రు. అనంతరం మరో ఇంజిన్‌ను అమర్చి రైలు ను ఆదిలాబాద్‌కు పంపించారు.
 
మ్యానువల్ బ్రేక్ సిస్టం వల్లే ప్రమాదం
 
మ్యానువల్ బ్రేక్ సిస్టం వల్లే ప్రమాదం జరిగిందని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు తెలిపారు. తిరుపతి నుంచి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణా ఎక్స్‌ప్రెస్ మెయిన్ డౌన్ లైన్‌లో సిగ్నల్ కోసం చింతలపల్లి రైల్వేస్టేషన్‌లో ఆగింది. అదే సమయంలో అప్ లైన్‌లో రైలు పట్టాలను తీసుకెళ్తు న్న యూటీవీ టీటీ మిషన్ రైలు సిగ్నల్ పాయిం ట్ వద్దకు వచ్చి షెడ్ సిగ్నల్ కోసం వేచి ఉంది. అయితే సిగ్నల్ ఇచ్చే క్రమంలో టీటీ మిషన్ బ్రేకులు కంట్రోల్ కాక ఫెయిల్యూర్ అయి సిగ్న ల్ దాటి కృష్ణా ఎక్స్‌ప్రెస్ ఇంజిన్‌ను ఢీకొట్టింద ని రైల్వే ఇంజినీరింగ్ అధికారులు చెప్పారు.

టీటీ మిషన్‌కు ఎయిర్ బ్రేక్ సిస్టం ఉంటే సిగ్నల్ దాటి ముందుకు పోయేది కాదని, కేవలం మ్యానువల్ బ్రేక్ ఉండటం వల్లే ఇలా జరిగింద ని వారు తెలిపారు. ఈ ఘటనలో టీటీ మిష న్ ఆపరేటర్ ఎస్‌కే.ఖాద్రి, చంద్రయ్య, సారయ్యతోపాటు మరో ఇద్దరికి స్వల్ప గాయాల య్యా యి. వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ జరిగిన సంఘటనపై రైలు డ్రైవర్  ఏకే.స్వరూప్‌తోపాటు ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు. చింతలపల్లి రైల్వే స్టేషన్‌కు వెళ్లి అక్కడ వివరాలు సేకరించారు.

 చిన్న ప్రమాదం కాబట్టి బతికిపోయాం.. : ప్రయాణికులు

 రైల్వే సిబ్బంది నిర్లక్ష్యంగా సిగ్నల్ ఇచ్చి ట్రాక్ చేంజ్ చేయకపోవడం వల్లనే కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను స్క్రాప్ ఇంజిన్ ఢీకొట్టిందని, ఇది చిన్న ప్రమా దం కాబట్టి బతికిపోయూమని పలువురు ప్ర యాణికులు భయంతో వణికిపోతూ వివరిం చారు. సిబ్బంది అప్రమత్తంగా ఉండక పోవడం తోనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయ ని, ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై తగిన చర్యతీసుకోవాలని డిమాండ్ చేశారు. కృష్ణా ఎక్స్‌ప్రెస్ రైలును ఎలాంటి సౌకర్యాలు లేని చింతలపల్లిలో సుమారు 50 నిమిషాల పాటు నిలిపివేయడంతో ప్రయూణికులు ఇబ్బందులకు గురయ్యారు. ప్రమాదం జరగడంతో బెంబేలెత్తి న పలువురు రైలు దిగి బస్సులు, ఆటోల ద్వారా వరంగల్ చుట్టుపక్కల గ్రామాలకు వెళ్లి పోయారు. మిగిలిన వారు మంచినీరు, ఆహా రం దొరకక తల్లడిల్లిపోయారు. సంఘటన గురించి బంధువులకు సెల్‌పోన్ల ద్వారా క్షేమసమాచారం అందించారు.
 
 ఒక్కసారిగా కిందపడిపోయా..

 నెక్కొండ నుంచి వరంగల్‌కు కృష్ణా ఎక్స్‌ప్రెస్‌లో వెళ్తున్నాను. చింతలపల్లి వద్ద రైలు ఆగింది. హఠాత్తుగా కొద్ది శబ్ధంతో రైలును టీటీ మిషన్ తాకడంతో కిందపడి పోయాను. నా నుదురుకు దెబ్బతాకింది. ఇంకా బెర్తులపై పడుకున్నవారు, నిలబడ్డవారు కిందపడిపోయారు. పెద్దగా ఎవరికీ దెబ్బలు తాకలేదు.
 -సోంద్‌మియా, నెక్కొండ, ప్రయాణికుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement