
ఒమర్ది కొత్త మాజేరే
కొనకళ్ల సుబ్రహ్మణ్యం.. అలియాస్ ఒమర్.. జాతీయ స్థాయిలో చల్లపల్లి మండలానికి చెడ్డపేరు తెచ్చిన యువకుడు.
♦ చిన్నాపురంలో పుట్టి పెరిగి హైదరాబాద్కు వెళ్లిన సుబ్రహ్మణ్యం
♦ తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్న పోలీసులు
♦ పని కోసం వెళ్లి ఐసిస్కే సానుభూతిపరుడిగా మారిన వైనం
చల్లపల్లి (అవనిగడ్డ): కొనకళ్ల సుబ్రహ్మణ్యం.. అలియాస్ ఒమర్.. జాతీయ స్థాయిలో చల్లపల్లి మండలానికి చెడ్డపేరు తెచ్చిన యువకుడు. ఉగ్రవాద సంస్థ ఐఎస్ఐఎస్కు అనుకూలంగా పని చేస్తూ, శుక్రవారం పోలీసులకు చిక్కిన సుబ్రహ్మణ్యం ఎవరు.. ఎక్కడివాడు.. అనే ప్రశ్నకు శుక్రవారం అర్ధరాత్రి సమాధానం లభించింది.
పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాలతో సుబ్రహ్మణ్యం గత చరిత్ర గురించి తెలుసుకునేందుకు పోలీసులు జల్లెడ పట్టారు. పోలీసులు ఎట్టకేలకు చల్లపల్లి మండలంలోని కొత్తమాజేరులో సుబ్రహ్మణ్యం మూలాలు కనుగొన్నారు. అత ని తల్లిదండ్రులు కొనకళ్ల వెంకట నరసింహారావు దంపతులను అదుపులోకి తీసుకుని హుటాహుటిన అవనిగడ్డ డీఎస్పీ వద్దకు తరలించారు.
కుటుంబ నేపథ్యం..
కొనకళ్ల సుబ్రహ్మణ్యం తాత వెంకటేశ్వర్లుది కొత్తమాజేరు గ్రామం. ఆయనకు ముగ్గురు కుమారులు. పెద్దవారై న రామారావు, నాగేశ్వరరావు వివాహాలు చేసుకుని గ్రామంలోనే స్థిరపడ్డారు. చిన్న కుమారుడైన వెంకట నరసిం హారావు వివాహం అనంతరం బందరు రూరల్ మండలం చిన్నాపురం గ్రామానికి 23 ఏళ్ల కిందట ఇల్లరికం వెళ్లాడు. నరసింహారావు పెద్ద కుమారుడు ప్రస్తుతం పంజాబ్లో ఇంజనీరింగ్ పూర్తి చేయగా, రెండో కుమారుడైన సుబ్రహ్మణ్యం డిగ్రీ లోనే దారి తప్పి ప్రస్తుతం పోలీసులకు చిక్కాడు.
ఇంటర్లోనే ఇస్లాం...
మచిలీపట్నంలోని రామకృష్ణ హైస్కూల్లో పదవ తరగతి చదివిన సుబ్రహ్మణ్యం... అక్కడి ముస్లిం విద్యార్థులతో కలసి ఉర్దూ మాట్లాడటం నేర్చుకున్నాడు. హైస్కూల్లో ముస్లిం మతంపై ఆసక్తి చూపేవాడని తెలుస్తోంది. అతను ఇంటర్లోనే ఇస్లాం స్వీకరించినట్లు తెలిసింది. ఇంటర్లోనే ముస్లిం సంప్రదాయం ప్రకారం సున్తీ చేయించుకున్న సుబ్రహ్మణ్యం మచిలీపట్నంలోని మదరసాలో చేరినట్లు సమాచారం. అనంతరం ఇంటి నుంచి వెళ్లిపోయి గుజరాత్, చెన్నై, బెంగళూరు మదరసాల్లో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే మచిలీపట్నంలోనే డిగ్రీ చదివే సమయంలో సుబ్రహ్మణ్యం తన మాట వినడం లేదని తండ్రి నరసింహారావు మందలించాడు.అదే సమయంలో సుబ్రహ్మణ్యం ఇక్కడ ఉంటే ఏమైపోతాడోనని భయపడిన తల్లి ప్రైవేటు ఉద్యోగం చూసుకోవా లని హైదరాబాద్లో ఉంటున్న తన అక్క వద్దకు పంపించారు. అక్కడ లస్సీ స్టాల్, కూల్ డ్రింక్స్ అమ్ముకుని జీవిం చిన సుబ్రహ్మణ్యం ఐఎస్ఐఎస్కు సానుభూతిపరుడిగా మారాడు. సుబ్రహ్మణ్యం ఆర్థిక ఇబ్బందుల కారణంగా డబ్బు కోసం ఐఎస్ఐఎస్లో చేరాడా? అనే సందేహానికీ తావు లేదు. స్వగ్రామం కొత్తమాజేరులో 4 ఎకరాల పొలం, చిన్నాపురంలో 3 ఎకరాల చెరువు, నిర్మాణంలో రెండతస్తుల భవనం ఉన్నాయి.
పరువు తీశాడు
తండ్రి మాట వినేవాడు కాదు. బాధ్యతగా చదువుకో బతుకు బాగుపడుతుందని చెప్పినా వినలేదు. ఇదిగో ఇప్పుడు ఇలా మా పరువు తీశాడు. కుటుంబాన్ని రోడ్డుకీడ్చాడు. ఇకనైనా బుద్ధిగా ఉంటాడని మా ఆశ.
– కొనకళ్ల వెంకటేశ్వర్లు, సుబ్రహ్మణ్యం తాత