వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పార్టీ పెట్టవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు.
సాక్షి, హైదరాబాద్: వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి పోటీగా ముఖ్యమంత్రి కిరణ్కుమార్రెడ్డి పార్టీ పెట్టవచ్చని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ అభిప్రాయపడ్డారు. ప్రస్తుత రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే కిరణ్ కాంగ్రెస్లో కొనసాగే పరిస్థితి కనిపించట్లేదని నూతన సంవత్సరం సందర్భంగా నారాయణ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జనవరి 23 తర్వాత కూడా ప్రస్తుత రాజకీయ సస్పెన్స్ కొనసాగుతుందని, అప్పటివరకు కిరణ్ సీఎంగా కొనసాగి సర్దుకోవాల్సిందంతా సర్దుకుని శాసనసభా వేదికగా సుదీర్ఘ ప్రసంగం చేసి రాజీనామా చేయవచ్చని నారాయణ అంచనా వేశారు.
‘‘రాజకీయ సంచలనం కలిగించాలన్నది కిరణ్ ప్రణాళికగా ఉంది. ఆయన పెట్టే పార్టీ వల్ల పెద్దగా ఫలితమేమీ ఉండకపోయినా వైఎస్సార్సీపీకి చెక్ పెట్టడానికేనన్న వాదన విస్తృతంగా వినిపిస్తోంది’’ అని పేర్కొన్నారు.