-
CPI Narayana: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి
విశాఖ: రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ స్పష్టం చేశారు. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుందని నారాయణ తెలిపారు. ఈరోజు(శుక్రవారం) రుషికొండలో జరుగుతున్న నిర్మాణాలను పరిశీలించిన అనంతరం నారాయణ మాట్లాడారు. ‘రుషికొండపై టూరిజం నిర్మాణాలే జరుగుతున్నాయి. కొత్త నిర్మాణాలతో టూరిజం అభివృద్ధి చెందుతుంది. సీఎం క్యాంప్ ఆఫీస్ నిర్మాణమనేది అవాస్తవం.కొండపైకి ఎవరినీ అనుమతించకపోవడం వల్లే అపోహలు’ అని పేర్కొన్నారు. -
పవన్ కల్యాణ్.. చెంగువీరా అయ్యారు..
సాక్షి, విజయవాడ : భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్పై సీపీఐ నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. పవన్ తీరును ఆ పార్టీ నేతలు ఎండగట్టారు. సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ.. ‘పవన్వి స్వార్థ ప్రయోజనాలు ...ఆయన మాకు దూరమైనందుకు బాధ పడటం లేదు. కమ్యూనిస్ట్ భావజాలం ఉందని చెప్పుకునే పవన్ కల్యాణ్ మతతత్వ పార్టీలోకి ఎలా వెళ్లారు. వామపక్షాలకు బాకీ లేదన్న ఆయన.. ప్రజాస్వామ్యానికి మాత్రం బాకీ పడ్డారు.అవకాశ వాదంతో పార్టీలు మారడం సహజం. అయితే.. సిద్ధాంతాలు నచ్చాయని వ్యాఖ్యలు చేయడం ఎందుకు? ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీతో కలిసి పవన్ రాష్ట్రానికి ఏ ప్రయోజనాలను కాపాడతారు? సీఏఏ, ఎన్నార్సీని సమర్థించిన నరేంద్ర మోదీ, అమిత్ షా దేశద్రోహులు. అలాంటి చట్టాలను సమర్థిస్తున్న పవన్ కూడా దేశద్రోహే’ అని ధ్వజమెత్తారు. పవన్ కల్యాణ్ది అవకాశ వాదమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శించారు. గతంలో ఏపీకి పాచిపోయిన లడ్డూలు ఇచ్చారన్న ఆయన... నడ్డాను కలిసిన తర్వాత మంచి బందరు లడ్డూలు ఇచ్చారా అని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ వెళ్లిన నేతలు జేఎన్యూకు వెళితే పవన్ మాత్రం బీజేపీ కార్యాలయానికి వెళ్లారని విమర్శించారు. చేగువేరా ఆదర్శమన్నపవన్ ‘చెంగువీర’ అయ్యారని ఎద్దేవా చేశారు. అసలు బీజేపీతో పవన్ ఎందుకు కలుస్తున్నారో చెప్పాలని రామకృష్ణ డిమాండ్ చేశారు. దమ్మున్నవాడే బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతారని, పవన్ దమ్ముందో లేదో సమాధానం చెప్పాలని అన్నారు. చదవండి: వామపక్షాలకు పవన్ కల్యాణ్ ఝలక్ పవన్కు రాజకీయాల్లో స్థిరత్వం లేదు : అంబటి -
వెంకయ్య నాలుకకు నరం లేదా?: నారాయణ
రాజకీయాల్లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేస్తానన్న పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై సీపీఐ జాతీయ కార్యదర్వి కె. నారాయణ హర్షం వ్యక్తంచేశారు. కమ్యూనిస్టులతో చర్చిస్తాననడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. నల్లగొండ జిల్లా యాదగిరిగుల్లో ఆదివారం సీపీఐ తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తి బస్సు యాత్రను జాతీయ కార్యదర్శి కె. నారాయణ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అబద్దాల కోరు అని, ఆయనకు తనను విమర్శించే నైతిక హక్కులేదని అన్నారు. పదేళ్ల పాటు ప్రత్యేక హోదా తెస్తానన్న వెంకయ్య నాలుకకు నరం లేదా అని ప్రశ్నించారు. ప్రత్యేక హోదాపై ఆశలు, భ్రమలు కల్పించి మోసం చేయడం బీజేపీకే చెల్లిందన్నారు. గ్యాంగ్స్టర్ నయీం కేసును వెంటనే సీబీఐకి అప్పగించాలని డిమాండ్ చేశారు. -
'కన్హయ్యకు ఏదైనా జరిగితే కేంద్రానిదే బాధ్యత'
హైదరాబాద్ : ఢిల్లీ జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం (జేఎన్యూ) విద్యార్ధి సంఘం అధ్యక్షుడు కన్హయ్య కుమార్కు ఏదైనా జరిగితే అందుకు కేంద్రప్రభుత్వమే బాధ్యత వహించాలని సీపీఐ కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు కె.నారాయణ హెచ్చరించారు. కన్హయ్య ఎక్కడికి వెళితే అక్కడ బీజేపీ అనుబంధ విద్యార్ధి సంఘం- ఏబీవీపీ కార్యకర్తలు, సంఘ్పరివార్ దాడులు పరిపాటిగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా ఎక్కడైనా మీటింగ్లు పెట్టుకునే హక్కుందని, దాడులు, అల్లర్లతో కన్హయ్య నోరు నొక్కాలని చూస్తే బీజేపీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఢిల్లీ మొదలు పూణే వరకు అడుగడుగునా కన్హయ్య సభలకు ఆటంకాలు కల్పిస్తూ అల్లర్లు సృష్టిస్తున్న తీరును ఖండించారు. ఇపుడు ఏకంగా తుపాకులు, తూటాలతో బెదిరింపులు చేస్తున్నారని.. ఢిల్లీ జేఎన్యూ బస్లో తుపాకులు, తూటాలున్న సంచితో పాటు కన్హయ్యను హత మారుస్తామంటూ రాసిన బెదిరింపు లేఖ పోలీసులకు దొరికిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు. -
సెన్సెక్స్ను తగలబెట్టాలి
- బీజేపీ మతోన్మాదానికి వ్యతిరేకంగా పార్టీలు కదలాలి: నారాయణ సాక్షి, హైదరాబాద్: దేశానికి ప్రమాదకరంగా మారిన సెన్సెక్స్ను తగలబెట్టాలని సీపీఐ జాతీయ నేత కె.నారాయణ అన్నారు. మంగళవారం మఖ్దూంభవన్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, నేతలు అజీజ్పాషా, గుండా మల్లేష్, పల్లా వెంకటరెడ్డి, పశ్య పద్మతో కలసి మీడియాతో మాట్లాడారు. బిహార్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న క్రమంలో బీజేపీ గెలుస్తున్నట్లు ప్రచారం చేసుకుని కార్పొరేట్ కంపెనీలు షేర్లను అమ్ముకుని లాభపడ్డాయని చెప్పారు. ఈ ఫలితాల నేపధ్యంలో బీజేపీ మతోన్మాద విధానాలకు వ్యతిరేకంగా జాతీయ, ప్రాంతీయపార్టీలు ఐక్యంగా ముందుకెళ్లాలన్నారు. మోదీని ప్రసన్నం చేసుకునేందుకు ఆయన విధానాలకు ఏపీ సీఎం బాబు వంతపాడుతూ పులి మీద స్వారీ చేస్తున్నారన్నారు. పార్టీ 90వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని వచ్చే నెల 26న దేశవ్యాప్తంగా రాజకీయ కార్యక్రమాలపై ప్రచారాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు. 1-25 వరకు బస్సుయాత్ర: సీపీఐ 90వ వార్షికోత్సవం సందర్భంగా డిసెంబర్ 1 నుంచి 25 వరకు రాష్ర్టంలో బస్సుయాత్ర, ప్రచార కార్యక్రమాలను చేపడుతున్నట్లు పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి తెలిపారు. 26న నిజాం కాలేజీ గ్రౌండ్స్లో సాంస్కృతిక మేళా, 27న బహిరంగసభ ఉంటుందన్నారు. ఈ నెల 14న ‘బహుళత్వ పరిరక్షణ-శాస్త్రీయ అవగాహన-అసమ్మతి హక్కు’ అనే అంశంపై మఖ్దూం భవన్లో సభ నిర్వహిస్తున్నామన్నారు.
Pagination
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
స్వల్పంగా పెరిగిన పసిడి.. అదే బాటలో వెండి
అమెరికన్ల ఇంటి పేర్లు ఎలా ఉంటాయో తెలుసా..!
ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
కూతురితో కలిసి ప్రముఖ ఆలయాన్ని సందర్శించిన స్టార్ హీరోయిన్!
పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
AP కి కొత్త డీజీపీ గా హరీష్ కుమార్ గుప్తా
పల్నాడు సాక్షిగా చెప్తున్నా.. సీఎం జగన్ పవర్ ఫుల్ స్పీచ్ దద్దరిల్లిన మాచెర్ల
పొన్నూరు లో పవన్ సభ అట్టర్ ఫ్లాప్ అంబటి మురళీకృష్ణ సెటైర్లు
16 ఏళ్లకే గర్భం ఆపై భర్త మోసం.. ఇప్పుడు స్టార్ హీరోకు అత్తగా..
తప్పక చదవండి
- ఆస్ట్రేలియాలో కత్తిపోట్లకు బలైన భారతీయ విద్యార్థి..భూమి అమ్మి పైచదువులకు
- పూంచ్ ఉగ్రదాడి.. టెర్రరిస్టులపై రూ.20 లక్షల రివార్డు
- పురందేశ్వరి.. అది వారిని అవమానించడమే: విజయసాయిరెడ్డి
- ప్రవీణ్తో బ్రేకప్.. తొలిసారి స్పందించిన ఫైమా
- గర్ల్ ఫ్రెండ్కో డైమండ్.. మీకో గుడ్ న్యూస్..!
- అచ్చా.. అలాగా?: కోహ్లిపై గావస్కర్ కామెంట్స్.. ఫ్యాన్స్ ఫైర్
- ‘ధనాధన్’ ధోని డకౌట్.. ప్రీతి జింటా రియాక్షన్ వైరల్
- పొమ్మనలేక పొగ పెడుతున్నారా..!
- రూటే సెపరేటు
- AnjiBabu: జంపింగ్ జపాంగ్ పార్టీలు మారడంలో దిట్ట
Advertisement