దొంగలు పడ్డ ఆరు నెలలకు.. ఉమ్మారెడ్డి ఎద్దేవా | Kiran kumar reddy reacted late, says ysrcp | Sakshi
Sakshi News home page

దొంగలు పడ్డ ఆరు నెలలకు.. ఉమ్మారెడ్డి ఎద్దేవా

Aug 9 2013 2:56 PM | Updated on Jul 29 2019 5:31 PM

రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి వివరణ దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు.

రాష్ట్ర విభజనపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి విలేకరుల సమావేశం పెట్టి సుదీర్ఘ వివరణ ఇవ్వడాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎంపీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ఎద్దేవా చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు ఉందని ఆయన విమర్శించారు.

పైపెచ్చు, విభజన గురించి అటు అనుకూలంగా గానీ, ఇటు వ్యతిరేకంగా గానీ ఏమీ మాట్లాడకుండా ఆయన గోడమీద పిల్లి వాటంగా వ్యవహరించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ అంతర్గత తగాదాలతో రాష్ట్రంలో చిచ్చు రేపారని ఆయన అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement