ఖాజీపేట ఎస్‌ఐ రంగారావు సస్పెన్షన్‌

కడప అర్బన్‌ /ఖాజీపేట: ఖాజీపేట పోలీస్‌ స్టేషన్‌లో ఎస్‌ఐగా పనిచేస్తున్న ఎం.రంగారావును గురువారం కడప–కర్నూలు రేంజి డీఐజీ ఘట్టమనేని శ్రీనివాస్‌ సస్పెన్షన్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగిన ఓ కేసు విచారణలో తప్పుడు దర్యాప్తు చేసినట్లు పోలీసు ఉన్నతాధికారులు ప్రాథమికంగా నిర్ధారించుకున్నారు. ఖాజీపేట మండలం రంగాపురానికి చెందిన బండి హనుమంతుకు, వారి అన్నదమ్ములకు మధ్య ఉన్న భూమి, స్థలాల తగాదాలో తలదూర్చి అక్రమ కేసులను ఎస్‌ఐ రంగారావు బనాయించారు. ఆ మేరకు బాధితులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తమ దగ్గరున్న సాక్ష్యాధారాలను చూపారు. దీంతో డీఐజీ స్వయంగా తమ సిబ్బందితో విచారణ జరిపి చర్యలు తీసుకున్నారు. ఇప్పటికే గుట్కా, ఇతరత్రా అంశాలలో అవినీతికి పాల్పడినట్లు ప్రచారం ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top