టీడీపీ నేతలకు అలవాటుగా మారింది: కన్నా | Sakshi
Sakshi News home page

టీడీపీ నేతలకు అలవాటుగా మారింది: కన్నా

Published Mon, May 22 2017 7:09 PM

టీడీపీ నేతలకు అలవాటుగా మారింది: కన్నా - Sakshi

విజయవాడ: టీడీపీ నేతలకు బీజేపీని విమర్శించడం అలవాటుగా మారిందని ఆ పార్టీ సీనియర్‌ నేత, మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ అన్నారు.  టీడీపీ నేతలు విమర్శించడం, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఖండించడం...ఇదంతా ఓ నాటకంలా కనిపిస్తోందని ఆయన సోమవారమిక్కడ వ్యాఖ్యానించారు. ఈ తరహా కుట్రలను తాము అధిష్టానం దృష్టికి తీసుకు వెళతామని ఆయన తెలిపారు.

అలాగే ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు వ్యక్తిగతమా? లేక పార్టీ అభిప్రాయామా అనేది చెప్పాలని కన్నా ఈ సందర్భంగా డిమాండ్‌ చేశారు. ప్రధానమంత్రిని ప్రతిపక్ష నేత కలిస్తే తప్పేముందని, ఇందులో పెడర్థాలు తీయాల్సిన అవసరం లేదని అన్నారు. కాగా  గత సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా ఉంటే విజయవాడలో టీడీపీ మరింతగా భారీ మెజార్టీతో గెలిచేదని ఎంపీ కేశినేని నాని వ్యాఖ్యలు  చేసిన విషయం తెలిసిందే.

Advertisement
Advertisement