జేఎన్టీయూ అధికారుల తనిఖీల్లో వెల్లడి
బోధనా సిబ్బంది తక్కువే..
మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు
నేడు ప్రభుత్వానికి నివేదిక
హైదరాబాద్: ల్యాబ్ ఉంటే ఫ్యాకల్టీ లేరు, ఫ్యాకల్టీ ఉంటే ల్యాబ్ లేదు.. రెండూ ఉన్నావిద్యా ప్రమాణాల్లేవు.. లైబ్రరీల్లో పుస్తకాల్లేవు, సరైన మౌలిక సౌకర్యాలకూ దిక్కులేదు.. ఇదీ రాష్ట్రంలోని చాలా ఇంజనీరింగ్ కళాశాలల పరిస్థితి. చాలా కళాశాలల్లో నిబంధనల ప్రకారం ఉండాల్సిన వసతులేమీ లేవు, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఏర్పాట్లూ లేవు.. ఇంజనీరింగ్ కళాశాలల్లో జేఎన్టీయూహెచ్ నిర్వహించిన తనిఖీల్లో ఇలాంటి ఎన్నో కఠిన వాస్తవాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలు చేపట్టేందుకు హైదరాబాద్ జేఎన్టీయూ నేతృత్వంలో ఏర్పాటైన అఫిలియేషన్ల కమిటీల కళాశాలల్లో తనిఖీలు ప్రారంభించిన విషయం తెలిసిందే. 17వ తేదీ నుంచి ఎంసెట్ వెబ్ ఆప్షన్ల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో 16వ తేదీ సాయంత్రానికి ప్రవేశాలు చేపట్టే కాలేజీలపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో శుక్రవారం వరకు కళాశాలలను తనిఖీ చేసిన అధికారులు... రాత్రంతా వాటిని క్రోడీకరించే పనిలో పడ్డారు. కళాశాలల వారీ పరిస్థితులతో కూడిన నివేదికను శనివారం ఉదయమే ప్రభుత్వానికి పంపించేందుకు జేఎన్టీయూ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తంగా 319 ఇంజనీరింగ్ కాలేజీల్లో తనిఖీలు నిర్వహించగా... అందులో వంద కాలేజీల్లో చాలా ఎక్కువగా లోపాలను గుర్తించినట్లు తెలిసింది.
మిగతా కాలేజీల్లోనూ చాలా వాటిలో నిబంధనలకు అనుగుణంగా ఫ్యాకల్టీ, ల్యాబ్లు, మౌలిక సౌకర్యాలు లేనట్లుగా అధికారుల తనిఖీలో తేలినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటన్నింటినీ పరిశీలించి ఏయే కళాశాలలకు అఫిలియేషన్లు ఇస్తుందనే విషయం శనివారం వెల్లడికానుంది. దీంతో ఆదివారం ఉదయం నుంచి విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇచ్చే సమయానికి కళాశాలల సంఖ్య, సీట్ల వివరాలు పూర్తిగా అందుబాటులోకి రానున్నాయి. ఏయే కాలేజీలకు అఫిలియేషన్లు వస్తాయి..? ఏయే కాలేజీలకు అనుమతులు రావన్న దానిపై యాజమాన్యాలు కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నాయి. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ లోపాలున్న కాలేజీలకు అనుమతులు కష్టమేనన్న వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో ఆదివారం నుంచే జరిగే వె బ్ ఆప్షన్ల ప్రక్రియలో 220 వరకే కాలేజీలు అందుబాటులో ఉండే అవకాశం ఉన్నట్లు సమాచారం.
కాలేజీలన్నీ లోపాల పుట్టలే!
Published Sat, Aug 16 2014 12:21 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
హోమ్ ఓటింగ్ ప్రక్రియ వేగవంతం చేయండి
మోదీని ఆపే దమ్ము కేసీఆర్కే ఉంది
కాలవ అండ .. కరిగిన కొండ!
వైఎస్ జగన్తోనే సంక్షేమం
ప్రమాదంలో ఒకరి మృతి
ఐస్క్రీం తిని 100 మందికి అస్వస్థత
పాండవపురలోనూ అబార్షన్ దందా
స్టీరింగ్ విరిగి.. వరి మడిలోకి
కస్టడీలో రేవణ్ణ విచారణ
వీడియో బాధితుల కోసం సిట్ సహాయవాణి
తప్పక చదవండి
- సోనాక్షితో ఇంటిమేట్ సీన్స్.. ఆమె తల్లి ఏమన్నారంటే: నటుడు
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- సమ్మర్లో కొబ్బరిబోండంలోని నీటిని నేరుగా తాగేస్తున్నారా..?
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
- కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్
Advertisement