చర్యలు తీస్కోండి | Jayalalithaa agonized on encounter | Sakshi
Sakshi News home page

చర్యలు తీస్కోండి

Apr 10 2015 1:00 AM | Updated on Sep 3 2017 12:05 AM

చర్యలు తీస్కోండి

చర్యలు తీస్కోండి

ఎన్‌కౌంటర్ పేరిట ఏపీలో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను ...

చెన్నై: ఎన్‌కౌంటర్ పేరిట ఏపీలో తమిళనాడుకు చెందిన 20 మంది ఎర్రచందనం కూలీలను హతమార్చడంపై ఏఐఏడీఎంకే అధినేత జయలలిత ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్‌కౌంటర్ జరిగిన తీరుపై ఆమె పలు సందేహాలు వ్యక్తం చేశారు. నిజానిజాల నిర్ధారణకు విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబును డిమాండ్ చేశారు.

మీడియా, సామాజిక కార్యకర్తలు లేవనెత్తిన అం శాలతోపాటు ఫొటోలు సందేహాలకు తావిస్తున్నాయని పేర్కొన్నారు. ఏపీ పోలీసులు తీసుకున్న చర్య సరైనదేనా అన్న అనుమానాలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. పార్టీ తరఫున మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల సాయం ప్రకటించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement