శ్రీకాకుళ అర్బన్: ప్రధాన మంత్రి జన్ధన్ యోజన పేదలకు ఎంతో మేలు చేస్తుందని, ఈ పథకం కింద ప్రతి కుటుంబం రెండు ఖాతాలు తెరిచేలా బ్యాంకులు కృషి చేయాలని శ్రీకాకుళం ఎంపీ కె.రామ్మోహన్నాయుడు కోరారు. గురువారం ఆయన స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ పథకాన్ని ప్రారంభించి మాట్లాడారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాలు ప్రారంభించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ ప్రభుత్వం ఏ పథకం ప్రవేశపెట్టిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి నేరుగా జమ అవుతుందని తెలిపారు. పేదరిక నిర్మూలనకు దోహదపడుతుందన్నారు.
కలెక్టర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ మాట్లాడుతూ పథకం వల్ల ఒనగూరే ప్రయోజనాలను వివరించారు. జేసీ జి.వీరపాండ్యన్, ఆంధ్రాబ్యాంకు ఎల్డీఎం ఎం.రామిరెడ్డి, తదితరులు మాట్లాడారు. అంతకుముందు అతిథులు వివిధ బ్యాంకుల ఏర్పాటు చేసిన స్టాల్స్ పరిశీలించారు. కార్యక్రమంలో ఏజేసీ షరీఫ్, ఎస్బీఐ ఏజీఎం రాజారామ్మోనరావు, ఏపీజీవీబీ రీజనల్ మేనేజర్ బి.ఎస్.ఎన్.రాజు, నాబార్డు ఏజీఎం వాసుదేవన్, ఆంధ్రాబ్యాంకు ఏజీఎం రాజేంద్రకుమార్, సిండికేట్ బ్యాంకు ఏజీఎం సాంబిరెడ్డి, ఇతర బ్యాంకు అధికారులు, జిల్లాలోని శాఖాధికారులు పాల్గొన్నారు.
దేశాభివృద్ధిలో బ్యాంకులది కీలకపాత్ర
దేశాభివృద్ధిలో బ్యాంకులు కీలకపాత్ర పోషిస్తున్నాయని ఎంపీ రామ్మోహన్నాయుడు అన్నారు. ఎస్బీఐ మెయిన్ బ్రాంచ్లో ఆయన జన్ధన్ యోజన ప్రారంభం సందర్భంగా ఖాతాలు తెరిచే కార్యాక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. పేదరికాన్ని రూపుమాపి అవినీతి రహిత దేశంగా రూపొందించేందుకు ప్రధానికి అంతా సహకరించాలన్నారు. ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మాట్లాడుతూ పేదరికం లేని భారతదేశానికి ప్రధాని, ముఖ్యమంత్రి పాటుపడుతున్నారని, వారికి అంతా అండగా నిలవాలన్నారు. ఎస్బీఐ ఏజీఎం కె.కామేశ్వరరావు మాట్లాడుతూ జీరో అకౌంట్తో ఖాతాలను ప్రారంభించే ఈ కార్యక్రమానికి అనూహ్యై స్పందన వచ్చిందన్నారు.
ఆధార్ లేదా ఏదో ఒక గుర్తింపు కార్డుతో వ్యక్తిగత చిరునామాతో అకౌంట్ ప్రారంభించవచ్చునన్నారు. నెలలోపు లక్ష్యాన్ని పూర్తి చేస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తపరిచారు. అనంతరం ఎంపీ, ఎమ్మెల్యేల చేతుల మీదుగా కొత్త ఖాతాదారులకు పాస్బుక్లను అందజేశారు. కార్యక్రమంలో చీఫ్ మేనేజర్లు ఎస్.ఎం.బాషా, ఉదయకుమార్సింగ్, కార్యక్రమ నిర్వాహకుడు బి.శ్రీనివాసరావు, యూనియన్ సభ్యుడు ఎం. రమేష్, ఐ.జగన్నాధరావు, నటుకుల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
‘జన్ధన్’తో పేదలకు మేలు
Published Fri, Aug 29 2014 2:06 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధర్వంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
Lok Sabha Election 2024: యాదవ భూమిలో ఎస్పీకి అగ్నిపరీక్ష
పీఠమెక్కేదెవరో..?
మెరుగైన వైద్యసేవలు అందించాలి
ఉచిత శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి
బాబు మట్టికొట్టుకు పోతాడు
● పెన్షన్ డబ్బుల కోసం పండుటాకుల కష్టాలు ● బ్యాంకు చుట్టూ తప్పని ప్రదక్షిణలు ● ఆటోల్లో తిరగలేక నీరసిస్తున్న వృద్ధులు ● మండే ఎండల్లో అభాగ్యుల ముప్పుతిప్పలు ● ఎంత పనిచేశావు చంద్రబాబూ అంటూ కన్నీరుపెడుతున్న అవ్వాతాతలు
● ఆగమోక్తం..భాష్యకారుల ఉత్సవం
పేదల ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి
మాపై ఎందుకంత కక్ష
నేడు పలమనేరుకుసీఎం వైఎస్ జగన్
తప్పక చదవండి
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- దోస్త్ నోటిఫికేషన్ విడుదల
- వైఎస్ భాస్కర్రెడ్డికి బెయిల్
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- నేడు 4 చోట్ల సీఎం రేవంత్ ప్రచారం
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
Advertisement