సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు.
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సెలవుల్లో భాగంగా ఉమ్మడి హైకోర్టుకు 2వ తేదీ నుంచి 13వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. అయితే అత్యవసర కేసులను విచారించేందుకు జస్టిస్ సి.ప్రవీణ్కుమార్, జస్టిస్ చల్లా కోదండరాం, జస్టిస్ ఎ.రాజశేఖరరెడ్డి, జస్టిస్ ఎం.ఎస్.రామచంద్రరావు, జస్టిస్ ఎస్.వి.భట్, జస్టిస్ పి.నవీన్రావులను వెకేషన్ జడ్జీలుగా నియమించారు. మొదటి వెకేషన్ కోర్టులో జస్టిస్ ప్రవీణ్కుమార్, జస్టిస్ కోదండరాం, జస్టిస్ రాజశేఖరరెడ్డి నేతృత్వం వహిస్తారు.
అత్యవసర కేసులు ఉంటే కక్షిదారులు జనవరి 5న దాఖలు చేయాల్సి ఉంటుంది. వాటిని 7వ తేదీన విచారిస్తారు. అదే విధంగా రెండో వెకేషన్ కోర్టులో జస్టిస్ రామచంద్రరావు, జస్టిస్ భట్, జస్టిస్ నవీన్రావు ఉంటారు. 9వ తేదీన కేసులను దాఖలు చేస్తే, 13న విచారిస్తారు. ఈ మేరకు రిజిస్ట్రార్ జనరల్ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు.