వైఎస్ జగన్ రిమాండ్ 20 వరకు పొడిగింపు | Jaganmohan Reddy's judicial remand extended till September 20 | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ రిమాండ్ 20 వరకు పొడిగింపు

Sep 7 2013 3:20 AM | Updated on Jul 25 2018 4:09 PM

తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది.

సాక్షి, హైదరాబాద్: తన కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న ఆడిటర్ వి.విజయసాయిరెడ్డి, పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్, మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ, ఐఆర్‌ఏఎస్ అధికారి కేవీ బ్రహ్మానందరెడ్డిల రిమాండ్‌ను కూడా కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. వీరి రిమాండ్ గడువు ముగియడంతో శుక్రవారం చంచల్‌గూడ జైలు నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు.
 
 అలాగే ఇతర ఛార్జిషీట్లలో నిందితులుగా ఉన్న మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సబితా ఇంద్రారెడ్డి, ఐఏఎస్ అధికారులు బీపీ ఆచార్య, మన్మోహన్‌సింగ్, శ్యామూల్, గనుల శాఖ మాజీ డెరైక్టర్ వీడీ రాజగోపాల్, నిమ్మగడ్డ ప్రకాష్, ఈశ్వర్ సిమెంట్స్ పూర్వ ఎండీ సజ్జల దివాకర్‌రెడ్డి, దాల్మియా సిమెంట్స్ ఎండీ పునీత్ దాల్మియా, ఉద్యోగులు సంజయ్ ఎస్.మిత్రా, నీల్‌కమల్‌బేరి, జయ్‌దీప్‌బసు తదితరులు కోర్టు ఎదుట హాజరుకాగా... ఐఏఎస్ అధికారులు వెంకట్రామిరెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, రాంకీ సంస్థల అధినేత అయోధ్యరామిరెడ్డి, ఫార్మా కంపెనీల ప్రతినిధులు హాజరునకు మినహాయింపు కోరుతూ వారి తరఫు న్యాయవాదులు పిటిషన్‌లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఇదే కేసులో నిందితునిగా ఉన్న మోపిదేవి దాఖలు చేసుకున్న తాత్కాలిక బెయిల్ పిటిషన్‌పై విచారణను కోర్టు ఈనెల 10కి వాయిదా వేసింది.
 
 ఎమ్మార్, ఓఎంసీ కేసుల్లో రిమాండ్ పొడిగింపు
 ఎమ్మార్, ఓఎంసీ కేసులో నిందితునిగా ఉన్న సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డి, గాలి జనార్ధన్‌రెడ్డి, అలీఖాన్‌ల రిమాండ్‌ను సీబీఐ ప్రత్యేక కోర్టు ఈనెల 20 వరకు పొడిగించింది. వీరందరి రిమాండ్ ముగియడంతో బెంగుళూరు జైలు నుంచి గాలి జనార్ధన్‌రెడ్డి, అలీఖాన్‌లను, చంచల్‌గూడ జైలు నుంచి సునీల్‌రెడ్డి, బీవీ శ్రీనివాసరెడ్డిలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శుక్రవారం ప్రత్యేక కోర్టుల ప్రధాన న్యాయమూర్తి యు.దుర్గాప్రసాద్‌రావు ఎదుట హాజరుపర్చారు. ఎమ్మార్ కేసులో నిందితులుగా ఉన్న బీపీ ఆచార్య, కోనేరు రాజేంద్రప్రసాద్, విజయరాఘవ హాజరుకాగా...  ఐఏఎస్ అధికారి ఎల్‌వీ సుబ్రమణ్యం సహా ఇతర నిందితులు హాజరు మినహాయింపు కోరుతూ పిటిషన్లు దాఖలు చేయగా కోర్టు అనుమతించింది. ఓఎంసీ కేసులో గనుల శాఖ మాజీ డెరైక్టర్ రాజగోపాల్ హాజరుకాగా... అనారోగ్యం కారణంగానే ఐఏ ఎస్ అధికారి శ్రీలక్ష్మి కోర్టుకు హాజరుకాలేకపోతున్నారని ఆమె తరఫు న్యాయవాది కోర్టుకు నివేదిస్తూ ఆమె ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన మెడికల్ రిపోర్టును కోర్టుకు సమర్పించారు. దీన్ని కోర్టు అనుమతిస్తూ తదుపరి విచారణను ఈనెల 20కి వాయిదా వేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement