వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్గూడ జైలులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లాలో ఆందోళనలు పెల్లుబికుతున్నాయి.
సాక్షి, కడప : వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి చంచల్గూడ జైలులో చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా జిల్లాలో ఆందోళనలు పెల్లుబికుతున్నాయి. జన నేత దీక్షకు దన్నుగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు జిల్లాలో పలుచోట్ల కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేశారు. దీంతోపాటు జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ఆందోళనలు, రిలే దీక్షలు కొనసాగాయి.
కడప నగరంలోని పోస్టాఫీసు, బీఎస్ఎన్ఎల్తో పాటు పలు కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు వైఎస్ఆర్సీపీ మహిళా శ్రేణులు తాళాలు వేశారు. సీఆర్ఐ యూత్ ఆధ్వర్యంలో 30 మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు.
వీరికి జిల్లా కన్వీనర్సురేష్బాబు, మాజీ మేయర్ పి.రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి సంఘీభావం తెలిపారు. పులివెందుల పట్టణంలో జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. 40 మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. లింగాల, వేంపల్లె మండలాల్లో రిలే దీక్షలు కొనసాగాయి.
ప్రొద్దుటూరులో రాజుపాళెం మండలం వెంగలాయపల్లె సర్పంచ్ ఎల్.రాధమ్మ నేతృత్వంలో 24మంది మహిళలు జగన్ దీక్షకు మద్దతుగా రిలే దీక్షల్లో కూర్చొన్నారు. వీరికి నియోజకవర్గ సమన్వయకర్త రాచమల్లు ప్రసాద్రెడ్డి,మండల కన్వీనర్ నాగేంద్రారెడ్డి, రాజుపాలెం మండల కన్వీనర్ ఎస్ఎ నారాయణరెడ్డి, ఈవీ సుధాకర్రెడ్డి సంఘీభావం తెలిపారు.
మైదుకూరు నియోజకవర్గంలోని దువ్వూరులో డీసీసీబీ అధ్యక్షుడు తిరుపాల్రెడ్డి నేతృత్వంలో హైవే దిగ్బంధం చేశారు. మైదుకూరులో భారీ ర్యాలీ నిర్వహించి వంటావార్పు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పాల్గొన్నారు. జగన్ దీక్షకు మద్దతుగా సంబేపల్లెలో స్కూటర్ ర్యాలీ నిర్వహించి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు తమ నిరసన తెలియజేశారు.
జమ్మలమడుగులో జగన్ దీక్షకు మద్దతుగా ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి, తాతిరెడ్డి సూర్యనారాయణరెడ్డి, హనుమంతురెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలకు తాళాలు వేయించారు. వైఎస్సార్సీపీ నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు.
రైల్వేకోడూరులో జగన్ దీక్షకు మద్దతుగా వైఎస్ఆర్సీపీ నేతృత్వంలో 8మంది రిలే దీక్షల్లో కూర్చొన్నారు. పుల్లంపేటలో మాజీ మండలాధ్యక్షుడు బాబుల్రెడ్డి, పంజం సుకుమార్రెడ్డి, సాయికిశోర్రెడ్డి జగన్ దీక్షకు మద్దతుగా చేస్తున్న ఆమరణ దీక్ష రెండవ రోజుకు చేరుకుంది. వీరికి జిల్లా కన్వీనర్ సురేష్బాబు, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు బ్రహ్మానందరెడ్డి సంఘీభావం తెలిపారు.
రాజంపేట పట్టణంలో జగన్ దీక్షకు మద్దతుగా వివిధ గ్రామాలకు చెందిన 70 మంది దళితులు రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వీరికి ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పోలా శ్రీనివాసులురెడ్డి, నాగ సుధాకర్రెడ్డి సంఘీభావం తెలిపారు.
బద్వేలు నియోజకవర్గంలోని పోరుమామిళ్ల పట్టణంలో జగన్ దీక్షకు మద్దతుగా లారీ వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 17 మంది రిలే దీక్షల్లో పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ యూత్ ఆధ్వర్యంలో ఉట్టి కొట్టే ప్రదర్శనను ఏర్పాటుచేశారు.