
ఐటీ హబ్ల ఏర్పాటుతో ఉద్యోగ అవకాశాలు
రాష్ట్రంలో ఐటీ హబ్ల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఐటీ,
నరసాపురం అర్బన్ : రాష్ట్రంలో ఐటీ హబ్ల ఏర్పాటు ద్వారా యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర ఐటీ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి పల్లె రఘునాథరెడ్డి తెలిపారు. సోమవారం నరసాపురం వచ్చిన ఆయన స్థానిక రాయిపేటలో విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి, అనంతపురంలో ఐటీ హబ్లను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని చెప్పారు. రానున్న ఐదేళ్లలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 45 వేల కోట్ల మేర వ్యాపారాభివృద్ధి సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. రాష్ట్రంలో పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చే ఔత్సాహికులకు నాలుగు వారాల్లోనే అన్ని అనుమతులు ఇస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు బండారు మాధవనాయుడు, పితాని సత్యనారాయణ, మునిసిపల్ చైర్పర్సన్ పసుపులేటి రత్నమాల తదితరులు ఉన్నారు.