అమృత హస్తం..అధ్వాన హస్తం | indiramma schems for pregnants | Sakshi
Sakshi News home page

అమృత హస్తం..అధ్వాన హస్తం

Dec 14 2013 4:50 AM | Updated on Jun 2 2018 8:39 PM

గూడూరు, మరిపెడ, ఏటూరునాగారం, ములుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,078 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది జనవరిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రారంభించారు.

 వరంగల్, న్యూస్‌లైన్
 గూడూరు, మరిపెడ, ఏటూరునాగారం, ములుగు ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలోని 1,078 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ ఏడాది జనవరిలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకంలో మొత్తం 13,257 మంది లబ్ధిదారులు నమోదై ఉన్నారు. అమృత హస్తం ప్రకారం మహిళను గర్భవతిగా గుర్తించినప్పటి నుంచి ప్రసవమైన ఆరు నెలల వరకు అంగన్‌వాడీ సెంటర్లలో ప్రతి రోజూ ఉదయం 200 మిల్లీలీటర్ల పాలు, వంద గ్రాము ల కంది పప్పు, ఒక గుడ్డు, మధ్యాహ్నం పూట పప్పులు, కూరగాయలతో కూడిన భోజనం అందిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలు నిత్యావసర సరుకులు, కూరగాయలు, వంటచెరుకు తె చ్చి వంటచేసి పెట్టాలి.
 
 ఆ బిల్లును ఐసీడీఎస్‌కు పెట్టుకుంటారు. అరుుతే డబ్బులు ఐసీడీఎస్ ద్వారా అంగన్‌వాడీ కేంద్రం నిర్వాహకులకు నేరుగా రాకుండా గ్రామైక్య సంఘాలకు వస్తా రుు. వారు ఆ డబ్బులను అంగన్‌వాడీ కేంద్రాలకు పంచుతారు. ఇదంతా సక్రమంగా జరిగితే బాగానే ఉంటుంది. కానీ అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులకు, గ్రామైక్య సంఘాలకు మధ్య విభేదాలు తలెత్తుతున్నారుు. వంట చేసి పెట్టేది తామైతే... బిల్లులిచ్చే బాధ్యత వీఓలకివ్వడంపై అంగన్‌వాడీ కేం ద్రాల నిర్వాహకులు మండిపడుతున్నారు. అంతేకాకుండా సరుకులు ఇవ్వడం లేదంటూ..తాము తీసుకువచ్చిన సరుకులకు బిల్లులివ్వడం లేదని వాపోతున్నారు.
 
 గుడ్లు రాక...
 ఏటూరునాగారం మండలంలోని మానసపల్లి అంగన్‌వాడీ కేంద్రంలో బియ్యం, కోడిగుడ్లు సరఫరా కాలేదు. పప్పు, నూనె, సరఫరా చేసినట్లు సిబ్బంది చెబుతున్నారు. భాగ్యలక్ష్మి వీఓ సంఘం సభ్యులు తమకు సక్రమంగా కూరగాయలు ఇవ్వడం లేదని, సొంత ఖర్చులు పెట్టి ఆకు కూరలు వండి పెడుతున్నామని వెల్లడించారు. జనవరి 2013 నుంచి మే నెల వరకు కోడిగుడ్లు సరఫరా అయ్యాయని, జూన్ నుంచి సెప్టెంబర్ వరకు సరఫరా జరగలేదని. అక్టోబర్ నెలలో ఏవో చిన్న గుడ్లను ఇచ్చి... నవంబర్ నుంచి మళ్లీ ఇప్పటి వరకు సరఫరా చేయలేదని అంగన్‌వాడీ కార్యకర్త లక్ష్మీకుమారి వెల్లడించారు. ఒక నెల ఇచ్చి మరో నెల ఇవ్వకపోవడంతో బాలింతలు, గర్భిణులు, ప్రీస్కూల్ పిల్లలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ‘‘వరంగల్ నుంచి వచ్చే పాలు అప్పుడప్పుడు వస్తున్నాయి. వాహనాలు మొరారుుంచడంతో రోజూ పాలు సరఫరా చేయడం లేదు. వారంలో నాలుగు రోజులు బండి రిపేరు అంటున్నారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. కానీ పట్టించుకోవడం లేదు ఇలాగైతే ఎలా నెగ్గుకురాగలగుతాం’’... అని లక్ష్మీకుమారి ప్రశ్నించారు.
 
 బిల్లులే ఇత్తలేరు
 గూడూరు ప్రాజెక్టు పరిధిలోని మండల కేంద్రంలో కూరగాయల బిల్లులు ఇవ్వక ఇబ్బందులు పెడుతున్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్సీ కాలనీ సెంటర్‌లో 15 మంది గ ర్భిణులు, 15 మంది బాలింతలు ఉన్నారు. భోజనానికి బియ్యం, పప్పు, నూనె సరఫరా చేస్తున్నా... పాలు, గుడ్లు మరో కాంట్రాక్టర్ ద్వారా వస్తాయి. వీటిలో పాలు సరఫరా చేస్తున్నా... గుడ్లు మాత్రం నెల రోజులుగా సరఫరా కావడం లేదు. ‘తప్పనికుండా భోజనం వండి  పెట్టాలంటున్నారే తప్ప వంట చెరుకు, కూరగాయలు, పోపు సామాను ఇవ్వడం లేదు. వాటన్నింటినీ మేమే సొంత ఖర్చుతో కొని వండి పెడుతున్నాం.. 10 నెలలుగా పోపు సామాను, కూరగాయల బిల్లు ఇవ్వడం లేదు. అడిగితే వీఓ అకౌంట్‌లో వస్తాయని చెపుతున్నారు. దీంతో ఉన్న వాటితో వండి పెడుతున్నాను.’’ అని ఎస్సీ కాలనీ అంగన్‌వాడీ కార్యకర్త రామక్క చెప్పారు.  
 
 దొడ్డు బియ్యం తినలేకపోతున్నాం  
 అంగన్‌వాడీ కేంద్రం ద్వారా దొడ్డు బియ్యం అన్నం వండి పెడుతున్నారు. పాలు పోస్తున్నారు. గుడ్డు ఇవ్వక నెల రోజులయింది. కాంట్రాక్టర్ తేలేదని తెలుస్తుంది. అమృత భోజనానికి సగం సరుకులు ఇచ్చి అంగన్‌వాడీ కార్యకర్తలను, ఆయాలను ఇబ్బంది పెట్టినట్లుగా ఉంది. సరుకుల రవాణా సక్రమంగా చేయాలి. దొడ్డు బియ్యం అన్నం తినలేక పోతున్నాం. పాలు, గుడ్డు ఇస్తే తిని, అన్నం ఇంట్లో వాళ్లకు పెడుతున్నాం.
 - సరిత, గర్భిణి, కలకత్తాతండా, మరిపెడ మండలం
 
 ఏడాది నుంచి బిల్లు లేదు  
 కూరగాయల బిల్లులకు సంబంధించి బిల్లులు వీఓ సంఘాలు ఇస్తాయని చెప్పారు. ప్రతి నెలా ఈ బిల్లులను వీఓ అకౌంట్ కాకతీయ గ్రామీణ బ్యాంక్‌లో కాకుండా వేరే అకౌంట్‌లో వేస్తున్నారు. ఈ బిల్లులు సంవత్సరం నుంచి వత్తలేవు. దీంతో వీఓ సంఘాలు అంగన్‌వాడీలను బిల్లు విషయమై ఇబ్బందులు పెడుతున్నారు. గుడ్ల విషయంలో మే వరకు బాగానే ఉన్నా అప్పటి నుంచి గుడ్ల పంపకం జరగలేదు. గత నెల క్రితం 15 రోజులకు సంబంధించి గుడ్లు ఇచ్చారు. ప్రస్తుతం గుడ్లు రాక పది రోజులు కావస్తుంది. జూన్ నుంచి పోపు సామాన్లు రావడం లేదు. ప్రతి నెలా జీతం డబ్బులు సక్రమంగా అందక ఇబ్బందులు పడుతున్నారు.  
 - సోల వీరలక్ష్మి, అంగన్‌వాడీ సెంటర్ 1, ములుగు కార్యకర్త
 
 బిల్లులు రాక ఇబ్బందులు
 మహిళా సంఘం నుంచి  కేంద్రానికి వంట సరకులు సరఫరాచేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నాం. పథకం ప్రారంభం అయి సంవత్సరం గడుస్తున్నా ఒడిదొడుకుల మధ్యే నడుస్తున్నాయి. నూనె సరఫరాకాక పదిహేను రోజులు గడిచింది. పెట్టుబడి పెట్టిన సమయానికి బిల్లులు రావడంలేదు. వచ్చినా అవి వీఓల అకౌంట్లో డబ్బులు జమ కావడం ఇబ్బందే.
 - గంధసిరి పద్మ, అంగన్‌వాడీ కార్యకర్త, మరిపెడ
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement