ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు | indira gandhi stadium selected for republic day celebrations in ap | Sakshi
Sakshi News home page

ఇందిరాగాంధీ స్టేడియంలో రిపబ్లిక్ డే వేడుకలు

Jan 6 2015 5:52 PM | Updated on Sep 2 2017 7:19 PM

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను ఎంపిక చేశారు.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించేందుకు విజయవాడలోని ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను ఎంపిక చేశారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, డీజీపీ జేవీ రాముడు ఇందిరాగాంధీ మునిసిపల్ స్టేడియంను మంగళవారం పరిశీలించారు.

ఉదయం ఏడుగంటలకే గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలను ప్రారంభిస్తామని సీఎస్, డీజీపీ తెలిపారు. ఇక రాష్ట్ర డీజీపీ కార్యాలయాన్ని విజయవాడకు తరలించడం మాత్రం ఇప్పట్లో సాధ్యం కాదని అన్నారు. విజయవాడలో క్యాంపు కార్యాలయాన్ని మాత్రమే ఏర్పాటు చేస్తామని డీజీపీ జేవీ రాముడు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement