ప్రపంచ ప్రసిద్ధి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511 వర్ధంతి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి.
రాజంపేట, న్యూస్లైన్ : ప్రపంచ ప్రసిద్ధి చెందిన తొలి తెలుగు వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యుల 511 వర్ధంతి మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలను తాళ్లపాకలోని ధ్యానమందిరంతో పాటు 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద నిర్వహించనున్నారు. ఉత్సవాలు ఈ నెల 31 వరకు కొనసాగనున్నాయి. వీటిని టీటీడీ నిర్వహించనుంది. తాళ్లపాకలో నృత్య, హరికథ, సంగీతసభలు, గ్రామోత్సవాలు నిర్వహించనున్నారు. కళకారులు భాగస్వాములు కానున్నారు.
ఏర్పాట్లు సిద్ధం
అన్నమాచార్య మహోత్సవాలకు టీటీడీ సకల ఏర్పాట్లు సిద్ధం చేసింది. తాళ్లపాకతో పాటు హైవేలోని తాళ్లపాక ముఖద్వారం నుంచి 108 అడుగుల అన్నమయ్య విగ్రహ వరకూ వేదికలు, ఆర్చ్లు ఏర్పాటు చేసింది. తాళ్లపాకలో ఉత్సవాల ప్రారంభం రోజు ఉదయం బహుళద్వాదశి పూజ కార్యక్రమంతో పాటు సప్తగిరి సంకీర్తనలు, సంకీర్తనలు, గోష్టిగానం నిర్వహిస్తారు. తరువాత తాళ్లపాక అన్నమాచార్యుల చిత్రపటాన్ని ఊరేగించనున్నారు. చివరి రోజు(31న) తిరుపతి, తెనాలి, కాకినాడ, రాజంపేట, బోయనపల్లె కళాకారులతో నాటకాలు నిర్వహిస్తారు. అన్నమయ్య విగ్రహం వద్ద కూడా ఇవే కార్యక్రమాలు ఉంటాయి.
ఆ కీర్తనలు సజీవం
కలియుుగ దైవమైన వెంకటేశ్వరుడికి 32 వేల కీర్తనలతో ఆరాధించిన అన్నవూచార్యుడు తాళ్లపాకలో జన్మించారు. చందవూవురావె జాబిల్లి రావె.., అదివో అల్లదివో శ్రీ హరి వాసవుు.. వంటి కీర్తనలు ఆయునవే. క్రీ.శ 1408 సంవత్సరం క్రోధి వైశాఖ శుద్ధపౌర్ణివు రోజున తాళ్లపాకలో అన్నవుయ్యు జన్మించారు. తల్లి లక్కవూంబ, తండ్రి నారాయుణసూరి. అన్నవుయ్యు చిన్నప్పుడే తిరువుల చేరుకున్నారు.
తల్లితండ్రులు కోరగా తాళ్లపాకకు వచ్చి వివాహం చేసుకున్నారు. వుళ్లీ తిరువులకు వెళ్లారు. ఆయున ఇల్లాలు తివ్ముక్క సుభద్రా పరిణయుం రచించారు. అన్నయువ్యు కువూరుడు పెద తిరువులాచార్యులూ కీర్తనలు రచించారు. 1982లో అన్నవుయ్య ఆరాధన వుందిరాన్ని నిర్మించారు. ఈ వుందిరంలో అన్నవుయ్యు విగ్రహాన్ని నెలకొల్పారు. కాగా అన ్నమయ్య కీర్తనలు నేటికీ సజీవమే. అన్నవుయ్యు 32 వేల కీర్తనలు భాండాగారం తిరువులలోని శ్రీ వారి హుండీ వద్ద ఉండేవి.
500 ఏళ్ల తర్వాత వీటిని గుర్తించారు. ఇవి రాగిరేకుల రూపంలో నిక్షిప్తమై ఉన్నారుు. వీటిని టీటీడీ స్వాధీనం చేసుకొని ఉద్ధండులైన తెలుగు పండితులతో అనువాదం చేసి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లారు. కీర్తనలను అన్నవూచార్య ప్రాజెక్టు దిశదశలా వ్యాపించే విధంగా కృషి చేస్తోంది. ఈ ప్రాజెక్టు 1978లో ఏర్పాటైంది. భాండాగారాన్ని బ్రిటిష్ కాలం నాటి అధికారి క్యాంప్బెల్ వెలుగులోకి తీసుకొచ్చారు. 32 వేల కీర్తనలో 14,358 కీర్తనలు వూత్రమే పూర్తిగా లభ్యమయ్యాయి. ఆ తర్వాత దేవస్థానం ఇన్స్పెక్టర్ సాధు సుబ్రవుణ్యం వీటిని పూర్తిగా వెలుగులోకి తెచ్చారు. తొలిసారిగా 108 కీర్తనలను స్వయుంగా టీటీడీ ప్రచురించింది.