వైద్యశాలలో నిండుకున్న వ్యాక్సిన్లు
పాముకాటుతో వ్యవసాయ కూలీ మృతి
వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ మృతుడి బంధువుల ఆందోళన
రేపల్లె ప్రధాన రహదారిపై మృతదేహంతో నిరసన
పోలీసుల జోక్యంతో ఆందోళన విరమణ
ప్రభుత్వ వైద్యశాలల్లో అన్ని వసతులు ఉన్నాయని, నిరంతరం వైద్యులు అందుబాటులో ఉండటంతో పాటు అన్ని రకాల మందులు సిద్ధంగా ఉన్నాయని గ్రామసభల్లో పాలకులు ప్రచారం చేస్తే నిజమేననుకున్నాం. పాముకాటుకు గురై ప్రాణాపాయ స్థితిలో వ్యక్తిని బతికించుకుందామని తీసుకొచ్చాం. తీరా వచ్చాక వైద్యులు సకాలంలో స్పందించలేదు. మందుల్లేవని చావుకబురు చల్లగా చెప్పారు. ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లినా ప్రాణాలు దక్కేవి.’ అంటూ మృతుడి బంధువులు బోరున విలపించారు. మృతదే హంతో రాస్తారోకో చే శారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన రేపల్లె పట్టణంలో సోమవారం ఉదయం చోటుచేసుకుంది.
రేపల్లె మండలంలోని గుడ్డికాయలంక గ్రామానికి చెందిన చిట్టిమోతు ప్రసాద్(50) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య, కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. సోమవారం వేకువజామున గ్రామ సమీపంలోని ఓ పొలంలో గడ్డి మోపులు కట్టేందుకు వెళ్లారు. గడ్డిలో ఉన్న పాము ప్రసాద్ భుజంపై కాటు వేసింది. కాలువేసింది రక్తపింజరిగా గుర్తించిన ప్రసాద్ వెంటనే విషయాన్ని చుట్టుపక్కల వారికి తెలిపాడు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది బాధితుడిని రేపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. విషమంగా ఉన్న ప్రసాద్కు చికత్స చేసే విషయంలో వైద్యులు సకాలంలో స్పందించలేదని, పాము కాటుకు విరుగుడు మందులు కూడా అందుబాటులో లేకపోవటంతోనే మృతి చెందాడని బంధువులు ఆరోపించారు.
మందులు అందుబాటులో ఉంటే ప్రసాద్ ప్రాణాలు పోయేవికావంటూ ఆసుపత్రి ఆవరణంలో నిరసన ప్రదర్శన చేపట్టారు. గతంలో జరిగిన గ్రామసభల్లో ప్రభుత్వ వైద్యులు, పాలకులు ప్రభుత్వ వైద్యశాలలో అన్ని వసతులు, మందులు ఉన్నాయని ప్రచారం చేస్తేనే ఇక్కడికి తీసుకువచ్చామని విలపించారు. ఇలాగైతే ప్రభుత్వ వైద్యశాల పట్ల నమ్మకం ఎలా ఉంటుందని ప్రశ్నించారు. ప్రధాన రహదారిపై మృతదేహాన్ని ఉంచి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. మృతుని కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పట్టణ సీఐ వి.మల్లికార్జునరావు ఆధ్వర్యంలో పోలీసులు రంగప్రవేశం చేసి రాస్తారోకోను విరమింపజేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ప్రభుత్వాస్పత్రికి వస్తే ప్రాణాలే పోయాయి
Published Tue, Feb 16 2016 3:43 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
మూడో భర్తతో విడాకులు తీసుకున్న స్టార్ సింగర్
IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
Namita Dubey: నిజమైన యాక్టర్స్.. తమ పాత్ర గురించే ఆలోచిస్తారు!
చంద్రబాబును ఏకిపారేసిన కొడాలి నాని..
రూ. 10కే హెయిర్ కటింగ్.. 4 గంటలు వేచి ఉంటున్న జనం!
ఇంట గెలవని రాణి..!
కారులో వెళ్తుండగా గ్రామస్తులు అడ్డుకుని చితకబాదారు: నటుడు
కూటమి మేనిఫెస్టో కాదు...టీడీపీ మేనిఫెస్టో..
సీఎం జగన్ హిందూపురం స్పీచ్..బాలకృష్ణ గుండెల్లో గుబులు..
తప్పక చదవండి
- నెహ్రూ తండ్రి అప్పటి అంబానీ: కంగనా కీలక వ్యాఖ్యలు
- సుచరితకు హ్యాండిచ్చిన కాంగ్రెస్.. పూరీ బరిలో ఆయనే..
- AP: ఆ జిల్లాల్లో రెండు రోజుల పాటు వర్షాలు
- అబద్ధాల వసంతం.. గ్రూపు రాజకీయాలే ఆసాంతం
- మహిళలపై టీడీపీ అభ్యర్థి అనుచిత వ్యాఖ్యలు
- జైళ్లకు భయపడను.. ప్రాణాలైనా బలిపెడతా: కేసీఆర్
- ఐరాసలో జగన్ విజన్
- బెంగళూరు గెలుపు ‘హ్యాట్రిక్’
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
Advertisement