పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం కుందూరు గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
ఏలూరు : పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం తుందుర్రు గ్రామంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గ్రామ సమీపంలో నిర్మిస్తున్న గోదావరి ఆక్వా మెగా పార్క్ వ్యతిరేకంగా పరిసర మూడు గ్రామ ప్రజలు శుక్రవారం తుందుర్రు గ్రామానికి చేరుకున్నారు. మెగా పార్క్ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. అ క్రమంలో అప్పటికే అక్కడ భారీగా పోలీసులు మోహరించి ఉన్నారు. దీంతో గ్రామస్తులను పోలీసులు అడ్డుకున్నారు. దాంతో ఇరువైపులా వాగ్వివాదం చోటు చేసుకుని... స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
పోలీసులు లాఠీ చార్జీకి దిగి... గ్రామస్తులపై విచక్షణ రహితంగా కొట్టారు. ఈ ఘటనలో గ్రామస్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇప్పటికే సదరు గ్రామాల్లో ఆక్వాసాగు వల్ల నీరు కలుషితమవుతుందని గ్రామస్తులు ఆరోపించారు. ఈ నీరు తాగి ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని సీపీఎం జిల్లా నాయకుడు బలరాం ఆరోపించారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఆందోళన చేస్తున్నారని చెప్పారు.