కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామిని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల గౌడ్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
మహానంది (కర్నూలు) : కర్నూలు జిల్లా మహానందిలోని శ్రీ కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామిని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి రాజశేఖర్ రెడ్డి, కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి వేణుగోపాల గౌడ్లు దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కాగా ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. కార్తీక మాసం సందర్భంగా భక్తులు స్వామివారి దర్శనానికి బారులు తీరారు. ఆలయ సిబ్బంది ఏర్పాట్లు సరిగ్గా చేయకపోవడంతో.. భక్తులు అవస్థలు పడుతున్నారు.