వారిపై కేసులు నమోదు చేయండి | High court on cock fighting | Sakshi
Sakshi News home page

వారిపై కేసులు నమోదు చేయండి

Mar 8 2018 2:58 AM | Updated on Aug 31 2018 8:40 PM

High court on cock fighting - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు నిర్వహించిన టీడీపీ ఎమ్మెల్యే సత్యప్రసాద్, ఎమ్మెల్సీ అన్నం సతీష్‌ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు దేవినేని మల్లికార్జునరావు, ముమ్మనేని వెంకట సుబ్బయ్యలపై  కేసులు నమోదు చేయాలని హైకోర్టు చెరుకుపల్లి పోలీసులను ఆదేశించింద

ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్‌ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులిచ్చింది. టీడీపీ నేతలపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ దాఖలైన మరో పిటిషన్‌పై కూడా ధర్మాసనం స్పందించింది. ఈ వ్యాజ్యంలో ప్రతివాదులుగా ఉన్న ప్రజాప్రతినిధులపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, కేసు నమోదు చేసేలా ఆదేశాలు జారీ చేయాలంటూ  న్యాయవాది భానుప్రకాశ్‌ పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement