వెంకన్న సన్నిధిలో గవర్నర్ దంపతులు | governor visits tirumala along with his wife | Sakshi
Sakshi News home page

వెంకన్న సన్నిధిలో గవర్నర్ దంపతులు

Jun 21 2015 6:48 PM | Updated on Sep 3 2017 4:08 AM

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి విమలా నరసింహన్ కూడా ఉన్నారు.

తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి విమలా నరసింహన్ కూడా ఉన్నారు.

గవర్నర్ దంపతులకు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సహా పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గడిచిన కొద్దిరోజులగా గవర్నర్ తీరిక లేకుండా గడిపిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement