తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి విమలా నరసింహన్ కూడా ఉన్నారు.
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవేంకటేశ్వరుని దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ ఆదివారం సాయంత్రం తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట సతీమణి విమలా నరసింహన్ కూడా ఉన్నారు.
గవర్నర్ దంపతులకు టీటీడీ బోర్డు చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి సహా పలువురు అధికారులు ఘనస్వాగతం పలికారు. ఓటుకు కోట్లు వ్యవహారంపై ఇరురాష్ట్రాల మధ్య నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా గడిచిన కొద్దిరోజులగా గవర్నర్ తీరిక లేకుండా గడిపిన సంగతి తెలిసిందే.