తలతిక్క సమాధానాలొద్దు! | Government welfare schemes beauty of each poor family qualified to give each student a scholarship | Sakshi
Sakshi News home page

తలతిక్క సమాధానాలొద్దు!

Nov 6 2013 3:28 AM | Updated on Sep 2 2017 12:18 AM

ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందాలని, అర్హులైన ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం అధికారులకు సూచించారు.

జెడ్పీసెంటర్, న్యూస్‌లైన్: ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి పేద కుటుంబానికి అందాలని, అర్హులైన ప్రతి విద్యార్థికి స్కాలర్‌షిప్ ఇవ్వాలని విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ చైర్మన్, నాగర్‌కర్నూల్ ఎంపీ మందా జగన్నాథం అధికారులకు సూచించారు. సంక్షేమం కోసం విడుదల చేసిన ప్రతి  సద్వినియోగం కావాలని ఆ దిశగా పనిచేయాల్సి కోరారు. అభివృద్ధి పనులపై తలతిక్క సమాధానాలు వద్దని హెచ్చరిం చారు.
 
 ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలకు ఎంపికైన లబ్ధిదారులకు బ్యాంక్ మంజురు పత్రాలు ఎందుకు ఇవ్వడం లేదని లీడ్‌బ్యాంక్ మేనేజర్‌ను ప్రశ్నించారు. సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక జెడ్పీ సమావేశ మందిరం లో జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. అధ్యక్షత వహించిన ఎంపీ మందా జగన్నాథం మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో తనకు తెలియకుండానే అభివృద్ధి పనులు జరుగుతున్నాయని ఆక్షేపించారు. వివిధ సంక్షేమ పథకాల కోసం రాష్ట్రానికి కేంద్రం ప్రభుత్వం సుమారు రూ.1000 కోట్లు విడుదల చేస్తుందని, ఈ నిధులను సద్విని యోగం చేసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందన్నారు. ఎస్సీలతో సమానంగా బీసీల అభివృద్ధికి నిధులు ఖ ర్చుచేసి వారి అభ్యున్నతి కోసం పాటుపడాలని సూచించారు. అయిజ మండలంలో కేజీబీవీ పాఠశాల నూతన భవనం పూర్తికాకముందే అందులో తరగతులు నడిపించడంపై ఆర్‌వీఎం పీఓ పద్మహర్షపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. మూత్రశాలలు, మరుగుదొడ్లు పూర్తి కాకుండానే తరగతులు నడిపించడం ఏమిటని నిలదీశారు. మూడు నెలలకు ఒకసారి మానిటరింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరారు.
 
 పూర్తి సమాచారంతో రావాలి
 ఉదయం 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం 11.45 గంటలకు ప్రారంభమైంది. అప్పటివరకు ఒక్కొక్కరు గాఅధికారులు హాజరుకావడంతో ఎంపీ వారిపై ఆగ్రహం వ్య క్తంచేశారు. అన్ని సంక్షేమశాఖల అధికారులతో ప్రతి అంశా న్ని క్షుణ్ణంగా సమీక్షించారు. ఆయన అడిగిన ప్రశ్నలకు అధికారు లు సమాధానం చెప్పలేకపోయారు. పూర్తి ఎజెండా, సమాచారంతో సమావేశానికి రావాలని సూచించారు.
 
 అంతకుముం దు కలెక్టర్ ఎం.గిరిజాశంకర్ మాట్లాడుతూ..సమాజంలోని అ న్ని వర్గాలకు పథకాల అమలులో సామాజిక న్యాయం కల్పిం చేందుకు ఈ కమిటీ ఉపకరిస్తుందన్నారు. ఎవరికి కేటాయించి న నిధులను వారికి ఖర్చుచేసేందుకు కృషిచేయాలని అధికారులకు సూచించారు. సమావేశ ఎజెండాను ముందే ప్రజాప్రతినిధులకు ఇవ్వాలని కోరారు. కాగా, సమావేశానికి జిల్లాలోని 14 మంది ఎమ్మెల్యేలకు సమాచారం ఉన్నప్పటికీ కేవలం ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే హాజరయ్యారు. సమావేశంలో ఏజేసీ డాక్టర్ రాజారాం, సాంఘిక సంక్షేమశాఖ డీడీ వి.జయప్రకాష్, బీసీ సంక్షేమాధికారి సంధ్య, గిరిజన సంక్షేమాధికారి ఉపేంద్రాచారి, ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.
 
 సంక్షేమ కార్యక్రమాలు జరగడం లేదు
 నా నియోజకవర్గంలో సంక్షేమ కా ర్యక్రమాలు సక్రమంగా అమలు జరగడం లేదు. అధికారులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కేజీ బీవీలో సిబ్బంది కొరతతో విద్యార్థు లు ఇబ్బందులు పడుతున్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు బ్యాంకులు కార్పొరేషన్ రుణాలు ఇవ్వడం లేదు. దీనిపై తగిన చర్యలు తీసుకోవాలి.
 - అబ్రహం, ఎమ్మెల్యే అలంపూర్
 
 పథకాలు ప్రజలకు చేరాలి
 ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు చేరువ చేసేందుకు అధికారులు చొరవ తీసుకోవడం లేదు. నానియోజకవర్గంలో ఎస్సీ, బీసీ, ఎస్టీ హాస్టళ్ల పరిస్థితి అధ్వానంగా ఉంది. కొన్ని హాస్టళ్లు శిధిలావస్థకు చేరుకున్నాయి. అధికారులకు చెప్పినా పరిస్థితి మారడం లేదు. సబ్‌ప్లాన్ నిధులను ఎస్సీ, ఎస్టీల అభ్యున్నతి కోసంఉపయోగించాలి.           
 - రాములు, ఎమ్మెల్యే, అచ్చంపేట
 
 హాస్టల్ భవనాలకు
 మరమ్మతులు చేపట్టాలి
 నా నియోజకవర్గంలో మంజురై న అభివృద్ధి పనులను పూర్తి చేసేం దుకు అధికారులు చొరవచూపాలి. హాస్ట ల్ విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని రకాల వసతులు కల్పించాలి. మం జురైన అభివృద్ధి పనులకు సరిపడా నిధులు కేటాయించాలి. శిథిలావస్థలో ఉన్న హాస్టల్ భవనాలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలి.
  - సీతమ్మ, ఎమ్మెల్యే దేవరకద్ర
 
 విద్యార్థుల మెస్‌చార్జీలు పెంచాలి
 ప్రజా సంక్షేమానికి ప్రభుత్వం కోట్లు మం జూరుచేస్తున్నా ఖర్చుచేయడంలో అధికారులు విఫలమవుతున్నారు. నా నియోజకవర్గంలో హాస్టల్‌ను నిర్మించి మూడేళ్లు గడిచినా కరెంట్ లేకపోవడం శోచనీయం. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులు దుర్భర జీవితం గడుపుతున్నారు. చదువుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్‌చార్జీలు పెంచాలి.
  - రావుల చంద్రశేఖర్‌రెడ్డి,
 ఎమ్మెల్యే వనపర్తి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement