ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం | Government talks APNGOs fail | Sakshi
Sakshi News home page

ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం

Sep 22 2013 2:40 PM | Updated on Sep 1 2017 10:57 PM

ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం

ఎపిఎన్జిఓలతో ప్రభుత్వ చర్చలు విఫలం

ఎపిఎన్జిఓ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి.

హైదరాబాద్: ఎపిఎన్జిఓ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి నాయకత్వంలో మంత్రి మండలి ఉపసంఘం ఎపిఎన్జిఓ నేతలతో చర్చలు జరిపింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె విరమించేదిలేదని నేతలు చెప్పారు.

చర్చలు ముగిసిన అనంతరం ఎపిఎన్జిఓ సంఘం అధ్యక్షుడు అశోక్ బాబు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయేది ఉద్యోగులేనని చెప్పారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement