పట్టాలు తప్పిన గూడ్స్ రైలు
సాక్షి, విజయనగరం : బొడ్డవర సమీపంలో గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. దాంతో కొత్త వలస కిరండోల్ మార్గంలో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఫలితంగా విశాఖ అరకు ప్యాసింజర్ రైలును కొత్త వలస వద్ద నిలిపేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎస్. కోట రైల్వే స్టేషన్లో నిలిచిన ప్యాసింజర్ రైలును వెనక్కి పంపే దిశగా అధికారులు చర్యలు చేపడుతున్నారు.