35 సవర్ల బంగారం చోరీ | Gold Robbery in Mypadu Village | Sakshi
Sakshi News home page

35 సవర్ల బంగారం చోరీ

Aug 20 2015 3:29 PM | Updated on Sep 3 2017 7:48 AM

ఇంట్లో భద్రపరిచిన 35 సవర్ల బంగారం చోరీకి గురైంది.

ఇందుకూరుపేట (నెల్లూరు జిల్లా) : ఇంట్లో భద్రపరిచిన 35 సవర్ల బంగారం చోరీకి గురైంది. ఈ సంఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం మైపాడు గ్రామంలో వెలుగు చూసింది. వివరాల ప్రకారం.. మైపాడు గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే వ్యక్తి ఇంట్లో 35 సవర్ల బంగారం చోరికి గురైంది.

అయితే వీరు ఈ బంగారాన్ని 20 రోజుల క్రితమే బీరువాలో భద్రపరిచినట్లు సమాచారం. కాగా గురువారం బీరువాలో బంగారం కనిపించకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఈ 20 రోజలు మధ్యలోనే కృష్ణయ్య కుటుంబంతో కలిసి పుష్కరాలకు కూడా వెళ్లి వచ్చినట్లు సమాచారం. దీంతో పోలీసులు దొంగతనం ఎప్పుడు జరిగిందో తెలుసుకునే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement