మొదలైన గోదావరి పుష్కరాలు | godhavari pushkaras started in east godhavari district | Sakshi
Sakshi News home page

మొదలైన గోదావరి పుష్కరాలు

Jul 7 2015 12:20 PM | Updated on Sep 3 2017 5:04 AM

రాజమండ్రి గోదావరి తీరంలో మరో సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం మంగళవారం నుంచి పుష్కరాలు మొదలయ్యాయి.

తూర్పుగోదావరి: రాజమండ్రి గోదావరి తీరంలో మరో సిద్ధాంతి వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం మంగళవారం  నుంచి పుష్కరాలు మొదలయ్యాయి. శ్రీశైల ఆస్థాన సిద్దాంతి బుట్టే వీరభద్ర దైవజ్ఞ గణాంకాల ప్రకారం ఇవాళ ఉదయం ఏడున్నర గంటలకు గురుడు సింహరాశిలో ప్రవేశించడంతో పుష్కరాలు ప్రారంభమవుతాయని నిర్థారించారు. సూర్యసిద్ధాంతం ఆధారంగానే నిర్ణయించిన ఈ సమయంలో రాజమండ్రి పుష్కరఘాట్లో బుట్టే సిద్ధాంతితోపాటు పలువురు భక్తులు పుష్కర స్నానాలు చేశారు. తాము నిర్ధారించిన సమయమే శాస్త్రోక్తమని తెలిపారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement