వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు | Krishna Pushkaralu attended to YS Jaganmohan Reddy | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు

Aug 12 2016 4:15 AM | Updated on May 25 2018 9:20 PM

వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు - Sakshi

వైఎస్ జగన్ పుష్కర స్నానం రేపు

ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న విజయవాడలో కృష్ణా పుష్కరస్నానం చేస్తారు.

సాక్షి, హైదరాబాద్: కృష్ణా పుష్కరాలు పురస్కరించుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈ నెల 13న విజయవాడలో స్నానమాచరిస్తారని పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారథి తెలిపారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..  వాస్తవానికి శుక్రవారం పుష్కర స్నానం చేయాలని జగన్ భావించారని, అయితే తొలిరోజు కావడంతో ప్రజలకు అసౌకర్యం కలిగే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో శనివారానికి మార్చుకున్నార ని వివరించారు. కృష్ణా పుష్కరాలు ప్రశాంతంగా జరగాలని, వీటి ద్వారా తెలుగు రాష్ట్రాల ప్రజలకు అంతా శుభం జరగాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement