విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో కంఠకాపల్లి సమీపంలో ఉన్న శారద కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం బ్రాయిలర్వద్ద ఉన్న గ్యాస్పైప్లీకైంది. దీంతో సమీపంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు.
కొత్తవలస : విజయనగరం జిల్లా కొత్తవలస మండలంలో కంఠకాపల్లి సమీపంలో ఉన్న శారద కర్మాగారంలో మంగళవారం మధ్యాహ్నం బ్రాయిలర్వద్ద ఉన్న గ్యాస్పైప్లీకైంది. దీంతో సమీపంలో పనిచేస్తున్న ముగ్గురు కార్మికులు గాయపడ్డారు. ఇనుపరాడ్డుల తయారీకి వినియోగించే ఫెర్రోక్రోమ్ను తయారు చేసే ఈ కర్మాగారంలో కాంట్రాక్టు కార్టులిఫ్ట్ ఆపరేటర్లుగా పనిచేస్తున్న కొత్తవలస మండలంలో చినరావుపల్లి గేటుకు చెందిన ఎం.శ్రీనివాసరావు(32), దన్నినపేటకు చెందిన కర్రి సత్యనారాయణ(30)లకు 80 శాతానికి పైగా కాలినగాయాలయ్యాయి.
వీరిద్దరి పరిస్థితి విషమంగా ఉంది. బీహార్కు చెందిన పూజారే(28) అనే యువకుడు కూడా ఈ ప్రమాదంలో గాయపడ్డాడు. ఈయనకు 50 శాతం కాలిన గాయాలయ్యాయి. గాయపడిన వారందరినీ విశాఖకేర్ ఆస్పత్రికి తరలించారు.